Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 యేళ్ళ బాలికపై మేనమామ అత్యాచారం.. ఆపై.. నోట్లో యాసిడ్ పోసి..

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (09:01 IST)
అభంశుభం తెలియని ఓ చిట్టితల్లి పాలిట మేనమామ యముడయ్యాడు. ఆ కామాంధుడి కంబంధ హస్తాల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. అప్పటికీ వదిలి పెట్టని ఆ కామమృగం.. ఆ బాలికను పట్టుకుని నోట్లో యాసిడ్ పోశాడు. దీంతో ఐదు నెలల పాటు ఆ చిన్నారి మృత్యువుతో పోరాడింది. చివరకు ప్రాణాలు విడిచింది. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఓ గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే,
 
ఈ గ్రామానికి ఓ మాజీ ఉపాధ్యాయుడికి తొలుత కుమారుడు పుట్టగా 18 యేళ్ల వయసులో చనిపోయాడు. ఆ తర్వాత చాలా కాలానికి కుమార్తె పుట్టింది. ఆమెను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. గత యేడాది సెప్టెంబరు 5వ తేదీన కుటుంబ సభ్యులు నెల్లూరుకు వెళ్లగా, బాలిక ఒంటరిగా ఇంట్లో ఉంది. ఇదే అదునుగా భావించిన మేనమామ వరుసయ్యే కామాంధుడు ఆ బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ క్రమంలో అతని నుంచి తప్పించుకుని, మరుగుదొడ్డిలో దాక్కుంది. అప్పటికీ వదిలిపెట్టలేదు. 
 
తలుపులు పగులగొట్టి చిన్నారి కేకలు వేయకుండా అక్కడే ఉన్న యాసిడ్‌ను నోట్లో పోశాడు. దీంతో చిన్నారి విలవిల్లాడింది. ఐదు నెలలపాటు చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రాస్టిక్ సర్జరీ చేసి ముఖాన్ని పాత స్థితికి తెస్తామని వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించారు. కానీ, వారి కలలు ఆవిరయ్యాయి. బాధితురాలు మంగళవారం ప్రాణాలు విడిచింది. ఈ విషయంపై దిశ పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments