Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 యేళ్ళ బాలికపై మేనమామ అత్యాచారం.. ఆపై.. నోట్లో యాసిడ్ పోసి..

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (09:01 IST)
అభంశుభం తెలియని ఓ చిట్టితల్లి పాలిట మేనమామ యముడయ్యాడు. ఆ కామాంధుడి కంబంధ హస్తాల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. అప్పటికీ వదిలి పెట్టని ఆ కామమృగం.. ఆ బాలికను పట్టుకుని నోట్లో యాసిడ్ పోశాడు. దీంతో ఐదు నెలల పాటు ఆ చిన్నారి మృత్యువుతో పోరాడింది. చివరకు ప్రాణాలు విడిచింది. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఓ గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే,
 
ఈ గ్రామానికి ఓ మాజీ ఉపాధ్యాయుడికి తొలుత కుమారుడు పుట్టగా 18 యేళ్ల వయసులో చనిపోయాడు. ఆ తర్వాత చాలా కాలానికి కుమార్తె పుట్టింది. ఆమెను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. గత యేడాది సెప్టెంబరు 5వ తేదీన కుటుంబ సభ్యులు నెల్లూరుకు వెళ్లగా, బాలిక ఒంటరిగా ఇంట్లో ఉంది. ఇదే అదునుగా భావించిన మేనమామ వరుసయ్యే కామాంధుడు ఆ బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ క్రమంలో అతని నుంచి తప్పించుకుని, మరుగుదొడ్డిలో దాక్కుంది. అప్పటికీ వదిలిపెట్టలేదు. 
 
తలుపులు పగులగొట్టి చిన్నారి కేకలు వేయకుండా అక్కడే ఉన్న యాసిడ్‌ను నోట్లో పోశాడు. దీంతో చిన్నారి విలవిల్లాడింది. ఐదు నెలలపాటు చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రాస్టిక్ సర్జరీ చేసి ముఖాన్ని పాత స్థితికి తెస్తామని వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించారు. కానీ, వారి కలలు ఆవిరయ్యాయి. బాధితురాలు మంగళవారం ప్రాణాలు విడిచింది. ఈ విషయంపై దిశ పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments