Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్థల వివాదం : పోలీస్ స్టేషన్‌ బయట తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించి కుమారుడు.. ఎక్కడ?

వరుణ్
బుధవారం, 17 జులై 2024 (11:41 IST)
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఓ స్థల వివాదం కారణంగా కన్నబిడ్డ కిరాతక చర్యకు పాల్పడ్డాడు. పోలీసు స్టేషన్‌ బయట కన్నతల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీన్ని గమనించిన పోలీసులు ఆ మహిళ ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే, తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సీసీటీవీలో రికార్డైన ఈ ఘటన అలీఘర్‌లోని ఖైర్ పోలీస్ స్టేషన్‌లో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగింది.
 
పోలీసులు వెల్లడించిన కథనం మేరకు.. ఓ స్థలం విషయంపై తల్లి హేమలత, కొడుకు గౌరవ్‌ల మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తుంది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు గౌరవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని పరిష్కరించుకునేందుకు వారిద్దరూ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఈ క్రమంలో బయటకు వెళ్లిన మహిళ తిరిగి వస్తుండగా బయటే నిలబడివున్న కుమారుడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 
 
ఆమెకు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ మహిళ తాళలేక గిలగిలా కొట్టుకుంది. మరోవైపు, కుమారుడు అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. ఒకవైపు కన్నతల్లి మంటల్లో కాలిపోతుంటే తన మొబైల్‌లో వీడియోను రికార్డు చేశాడు. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడటంతో క్షణకాలం వెనకడుగు వేసిన పోలీసులు.. ఆ తర్వాత ఆమెను రక్షించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
 
అయితే, అప్పటికే ఆమెకు 40 శాతం కాలిన గాయాలు కావడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో ఒకరిద్దరూ పోలీసులు కూడా గాయాలపాలయ్యారు. ఈ కిరాతక చర్యకు పాల్పడిన గౌరవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments