Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తతో అక్రమ సంబంధం.. చివరకు శవమై తేలాడు.. ఎలా?

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (08:57 IST)
వరుసకు అత్త అయిన మహిళతో ఓ యువకుడు పెట్టుకున్న వివాహేతర సంబంధం చివరకు అతని ప్రాణాలు తీసింది. ఈ దారుణం ఏపీలోని కడప జిల్లా రాజుపాళెం గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
మండల కేంద్రమైన రాజుపాళెంకు చెందిన నరసమ్మ అనే మహిళకు కొన్నేళ్ళ క్రితమే భర్త చనిపోయాడు. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలను పోషించుకుంటు ఉంటుంది. ఈ క్రమంలో తన కుమార్తెను అదే ఊరిలో ఓ పెద్ద దస్తగిరి అనే యువకుడికి ఇచ్చి పెళ్లి చేసింది. ఈయనకు తల్లి, తమ్ముడు చిన్న దస్తగిరి (28) ఉన్నాడు. వీరి తండ్రి కూడా కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. 
 
ఈ క్రమంలో నరసమ్మకు చిన్నదస్తగిరికి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. గత కొంతకాలంగా సాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో కుట్టుమిషన్లు రిపేరు చేసే దస్తగిరికి ఇటీవల పెళ్లి సంబంధాలు చూడసాగారు. ఈ విషయం నరసమ్మకు తెలిసింది. నేను ఉండగా మరో పెళ్లి ఎలా చేసుకుంటావో చూస్తానంటూ బెదిరించసాగింది. 
 
శుక్రవారం సాయంత్రం ఇదే విషయంపై అతడితో గొడవకు దిగింది. పైగా, చిన్నదస్తగిరి తనను వదిలి మరో పెళ్లికి సిద్ధమవడాన్ని జీర్ణించుకోలేక పోయింది. దీంతో ఆవేశంతో అతన్ని కత్తితో పొడవడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు హత్యాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నరసమ్మను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments