మూడు ముళ్ళు వేసిన వరుడిని పెళ్ళిపీటలపై అరెస్టు చేసిన పోలీసులు!!

ఠాగూర్
ఆదివారం, 25 ఆగస్టు 2024 (17:20 IST)
వధువు మెడలో మూడు ముళ్లు వేసిన కొన్ని ఘడియలు కూడా ముగియకముందే వరుడుని పెళ్లిపీటలపైనే పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని చిత్రదుర్గం జిల్లా హొళల్కెరె తాలూకా టి ఎమ్మిగనూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
టి.ఎమ్మిగనూరు గ్రామానికి చెందిన రంగస్వామి అనే యువకుడికి చెళ్లకెర తాలూకాలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికతో వివాహం నిశ్చయమైంది. ఈ విషయం స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి మల్లేశ్‌కు తెలిసింది. ఆయన పోలీసులను వెంటబెట్టుకొని ఆ గ్రామం చేరుకున్నారు. వివాహం వరుడి గ్రామం టి. ఎమ్మిగనూరులో జరుగుతోందని తెలుసుకొని ఆక్కడికి వెళ్లారు. 
 
ఆ పాటికే వరుడు వధువు మెడలో మూడుముళ్లు వేశారు. అధికారులు, పోలీసులు బాలిక చదివే పాఠశాలకు వెళ్లి ఆమె జన్మదిన వివరాలు సేకరించారు. బాలికకు 17 సంవత్సరాలు 2 రోజుల వయసున్నట్లు నిర్ధారించారు. చట్టం ప్రకారం పోలీసులు వరుడు రంగస్వామిని అదుపులోనికి తీసుకొని, కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. హొళల్కెరె పోలీసు ఠాణాలో కేసు నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

Madalsa Sharma: మదాలస శర్మ కాస్టింగ్ కౌచ్ కామెంట్లు.. కెరీర్‌ ప్రారంభంలోనే?

Nandamuri Tejaswini : సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి తేజస్విని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments