Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నానం చేస్తుండగా న్యూడ్ ఫోటోలు.. వాటిని చూపిస్తూ యేడాదిగా అత్యాచారం

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2023 (10:54 IST)
పొరుగింటి మహిళ స్నానం చేస్తుండగా ఓ కామాంధుడు ఆమెను నగ్నంగా ఫోటోలు తీశాడు. వాటిని చూపి బెదిరిస్తూ ఒక యేడాది కాలంగా ఆమెపై లైంగికదాడికి పాల్పడుతూ వచ్చాడు. విజయవాడ నగరంలో ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని విశాలాంధ్ర కాలనీకి చెందిన పుట్టా సుభాష్ (45) అనే వ్యక్తి బీపీసీఎల్ కంపెనీలో పైపులైన్ సెట్టింగ్ చేసే కార్మికుడు. రాజీవ్ నగర్‌కు చెందిన ఓ మహి (35) శాంతి నగర్‌లో భర్తతో కలిసి చిన్న కిరాణా దుకాణం నిర్వహిస్తుంది. పలుమార్లు ఆ దుకాణంలో సరకులు కొనుగోలు చేసిన సుభాష్... పేటీఎం ద్వారా డబ్బులు చెల్లించేవాడు. 
 
ఈ క్రమంలో ఆమె నంబరు తీసుకున్నాడు. ఇదిలావుంటే ఓ రోజున ఆమె స్నానం చేస్తుండగా, ఫోటోలు తీశాడు. వీటిని ఆమె ఫోనుకు పంపుతూ వేధించసాగాడు. పైగా వాటిని చూపి బెదిరించి అత్యాచారానికి తెగబడ్డాడు. అలా గత యేడాది కాలంగా బెదిరిస్తూనే అత్యాచారం చేస్తున్నాడు. 
 
అక్కడితో ఆగకుండా తనకు రూ.16 లక్షల డబ్బులు కావాలంటూ డిమాండ్ చేసి తీసుకున్నాడు. ఆ డబ్బును చెల్లించమని అడిగినందుకు ఆమెపై దాడి చేశాడు. అతని ఆగడాలు శృతిమించి పోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె సుభాష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. కామాంధుడిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments