Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. తీవ్ర రక్తస్రావంతో మృతి

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2023 (15:57 IST)
తెలంగాణ రాష్ట్రంలో దారుణం జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి రాష్ట్రానికి వలస వచ్చిన 16 యేళ్ళ మైనర్ బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. ఆ తర్వాత ఆ బాలిక తీవ్ర రక్తస్రావానికి గురికావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
మధ్యప్రదేశ్ నుంచి వలస వచ్చిన ఇతర కార్మికులు తెలిపిన సమాచారం మేరకు సదరు బాలిక నిర్మాణ రంగంలో పని చేయడం కోసం వచ్చి పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలోని శివపార్వతి నగరులో తన అక్కాబావలతో కలిసి ఉంటోంది. ఆగస్టు 14వ తేదీన మధ్యాహ్నం కూలీ డబ్బులు ఇస్తానని మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన కాంట్రాక్టర్ పెద్దపల్లి శివారు ప్రాంతంలో మరో ముగ్గురితో కలిసి అత్యాచారం చేసినట్లు సమాచారం. 
 
ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని బాలికను హెచ్చరించినట్లు తెలిసింది. రక్తస్రావంతో బాలిక తీవ్ర అస్వస్థతకు గురవడంతో మర్నాడు ఉదయమే సంబంధిత కాంట్రాక్టర్ ఆమె కుటుంబసభ్యులను స్వస్థలమైన మధ్యప్రదేశ్ రాష్ట్రం బాలాఘాట్ జిల్లా కజిరి గ్రామానికి ఓ వాహనంలో పంపించాడు. 
 
అయితే, ఆ బాలిక మార్గం మధ్యలో అధిక రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం ఎవరికీ తెలియ కుండా సదరు కాంట్రాక్టర్ జాగ్రత్త పడినా, ఫోన్ ద్వారా విషయం తెలుసుకున్న తోటి వలస కూలీలు అధికారులకు సమాచారం అందించారు. దీనిపై అధికారులు, పోలీసులు కలిసి ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments