Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవసరానికి డబ్బిచ్చిన మేనమామను చంపి ముక్కలు చేసిన కిరాతకుడు..

Webdunia
మంగళవారం, 18 జులై 2023 (09:07 IST)
తనకు అవసరానికి అడిగినపుడల్లా డబ్బు ఇచ్చిన మేనమామను ఓ కిరాతకుడు దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత శరీరాన్ని ముక్కలు చేసి సంచుల్లో పాతిపెట్టాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని గుణ జిల్లాకు చెందిన వివేక్ శర్మ (45) అనే వ్యాపారి తన మేనల్లుడు మోహిత్‌కు రూ.90 వేలు అప్పుగా ఇచ్చాడు. వాటిని తిరిగి ఇవ్వాలని కోరినా మోహిత్ పట్టించుకోలేదు. 
 
ఈ క్రమంలో డబ్బులు వసూలు చేసేందుకు ఈ నెల 12వ తేదీన వివేక్.. మేనల్లుడు మోహిత్ ఇంటికి వెళ్లాడు. డబ్బులు ఇవ్వడం లేదని మోహిత్ తన మేనమామను మట్టుబెట్టాలన్న నిర్ణయానికి వచ్చాడు. దీంతో మామకు మత్తు కలిపిన టీని మోహిత్ ఇచ్చాడు. దీన్ని సేవించగానే అతను అపస్మారకస్థితిలోకి జారుకున్నాడు. ఆ తర్వాత ఆయన్ను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు చేసి శరీర భాగాలను గోనె సంచుల్లో వేసి పాతిపెట్టేశాడు. 
 
అయితే, వివేక్ శర్మ ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసును నమోదు చేసిన పోలీసులు... మోహిత్‌‍ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పాతిపెట్టిన వివేక్ శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హ్యాట్సాఫ్ కింగ్ నాగార్జున.. నెట్టేసిన ఫ్యాన్‌ను కలిశాడు.. (వీడియో)

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments