Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవసరానికి డబ్బిచ్చిన మేనమామను చంపి ముక్కలు చేసిన కిరాతకుడు..

Webdunia
మంగళవారం, 18 జులై 2023 (09:07 IST)
తనకు అవసరానికి అడిగినపుడల్లా డబ్బు ఇచ్చిన మేనమామను ఓ కిరాతకుడు దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత శరీరాన్ని ముక్కలు చేసి సంచుల్లో పాతిపెట్టాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని గుణ జిల్లాకు చెందిన వివేక్ శర్మ (45) అనే వ్యాపారి తన మేనల్లుడు మోహిత్‌కు రూ.90 వేలు అప్పుగా ఇచ్చాడు. వాటిని తిరిగి ఇవ్వాలని కోరినా మోహిత్ పట్టించుకోలేదు. 
 
ఈ క్రమంలో డబ్బులు వసూలు చేసేందుకు ఈ నెల 12వ తేదీన వివేక్.. మేనల్లుడు మోహిత్ ఇంటికి వెళ్లాడు. డబ్బులు ఇవ్వడం లేదని మోహిత్ తన మేనమామను మట్టుబెట్టాలన్న నిర్ణయానికి వచ్చాడు. దీంతో మామకు మత్తు కలిపిన టీని మోహిత్ ఇచ్చాడు. దీన్ని సేవించగానే అతను అపస్మారకస్థితిలోకి జారుకున్నాడు. ఆ తర్వాత ఆయన్ను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు చేసి శరీర భాగాలను గోనె సంచుల్లో వేసి పాతిపెట్టేశాడు. 
 
అయితే, వివేక్ శర్మ ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసును నమోదు చేసిన పోలీసులు... మోహిత్‌‍ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పాతిపెట్టిన వివేక్ శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments