Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవసరానికి డబ్బిచ్చిన మేనమామను చంపి ముక్కలు చేసిన కిరాతకుడు..

Webdunia
మంగళవారం, 18 జులై 2023 (09:07 IST)
తనకు అవసరానికి అడిగినపుడల్లా డబ్బు ఇచ్చిన మేనమామను ఓ కిరాతకుడు దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత శరీరాన్ని ముక్కలు చేసి సంచుల్లో పాతిపెట్టాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని గుణ జిల్లాకు చెందిన వివేక్ శర్మ (45) అనే వ్యాపారి తన మేనల్లుడు మోహిత్‌కు రూ.90 వేలు అప్పుగా ఇచ్చాడు. వాటిని తిరిగి ఇవ్వాలని కోరినా మోహిత్ పట్టించుకోలేదు. 
 
ఈ క్రమంలో డబ్బులు వసూలు చేసేందుకు ఈ నెల 12వ తేదీన వివేక్.. మేనల్లుడు మోహిత్ ఇంటికి వెళ్లాడు. డబ్బులు ఇవ్వడం లేదని మోహిత్ తన మేనమామను మట్టుబెట్టాలన్న నిర్ణయానికి వచ్చాడు. దీంతో మామకు మత్తు కలిపిన టీని మోహిత్ ఇచ్చాడు. దీన్ని సేవించగానే అతను అపస్మారకస్థితిలోకి జారుకున్నాడు. ఆ తర్వాత ఆయన్ను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు చేసి శరీర భాగాలను గోనె సంచుల్లో వేసి పాతిపెట్టేశాడు. 
 
అయితే, వివేక్ శర్మ ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసును నమోదు చేసిన పోలీసులు... మోహిత్‌‍ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పాతిపెట్టిన వివేక్ శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments