Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన నిశ్చితార్థం.. కాబోయే భర్త వేధింపులు తాళలేక...

Webdunia
ఆదివారం, 14 నవంబరు 2021 (11:58 IST)
ఆ యువతికి నిశ్చితార్థం ముగిసింది. ఆ తర్వాత కాబోయే భర్త తన క్రూరత్వాన్ని చూపించసాగాడు. అతని వేధింపులు తాళలేక ఆ యువతి పెళ్లికి ముందే తనువు చాలించింది. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలోని హుబ్బళ్లి ప్రశాంత నగర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రశాంత నగరకు చెందిన పవిత్రా పాటిల్‌ హావేరికి చెందిన అభినందన్‌ అనే యువకుడితో ఇటీవల నిశ్చితార్థం జరిగింది. డిసెంబరు 2న వివాహం జరిపించాలని పెద్దలు నిర్ణయించారు. ఇటీవలే వీరిద్దరూ దాండేలికి విహారయాత్రకు వెళ్లి అనేక ఫొటోలు తీసుకున్నారు. 
 
అప్పటి నుంచి అభినందన్‌ అనేక అనుమానాలు పెట్టుకున్నాడని యువతి కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రతి చిన్న విషయాన్ని అనుమానంగా చూడడమే కాకుండా పవిత్రా పాటిల్‌ను వేధించేవాడని ఆరోపించారు. ఈ వేధింపులను తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. అశోక్‌ నగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments