Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరులో దారుణం - ఐఫోన్ కొనేందుకు డబ్బులు లేక డెలివరీ బాయ్‌ హత్య

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (12:46 IST)
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. ఈ-మార్కెటింగ్ వెబ్‌సైట్‌లో ఐఫోన్ బుక్ చేసిన ఓ వ్యక్తి.. దానికి డబ్బులు చెల్లించలేక డెలివరీ బాయ్‌ను హత్య చేసిన ఘటన ఒకటి వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని హాసన్ జిల్లాలోని అంచ్ కొప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ నెల 11వ తేదీన కాలిన శరీరాన్ని ఒకటి వెలుగు చూసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడిని హేమంత్ నాయక్ (20)గా గుర్తించారు. ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగిగా పని చేస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. 
 
లక్ష్మీపుర లే ఔట్ సమీపంలో నివాసం ఉండే హేమంత్ దత్తా అనే వ్యక్తి సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ను బుక్ చేసుకున్నాడు. దాన్ని డెలివరీ చేసేందుకు హేమంత్ నాయక్ ఈ నెల 7వ తేదీన హేమంత్ దత్తా ఇంటికి వచ్చాడు. ఫోన్ డెలివరీ చేసేందుకు రూ.46 వేలు చెల్లించాలని కోరాడు. అంత డబ్బు తన వద్ద లేకపోవడంతో డెలీవరీ బాయ్‌ను హేమంత్ దత్తా కత్తితో పొడిచాడు. 
 
ఆ తర్వాత మృతదేహాన్ని ప్యాక్ చేసి ద్విచక్రవాహనంపై పెట్టుకుని రైల్వే స్టేషన్ సమీపంలో పెట్రోల్ పోసి దహనం చేసినట్టు పోలీసులు జరిపిన విచారణలో వెల్లడైంది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు ఈ కేసులోని మిస్టరీని ఛేదించారు. దీంతో హేమంత్ దత్తాను పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments