Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరులో దారుణం - ఐఫోన్ కొనేందుకు డబ్బులు లేక డెలివరీ బాయ్‌ హత్య

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (12:46 IST)
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. ఈ-మార్కెటింగ్ వెబ్‌సైట్‌లో ఐఫోన్ బుక్ చేసిన ఓ వ్యక్తి.. దానికి డబ్బులు చెల్లించలేక డెలివరీ బాయ్‌ను హత్య చేసిన ఘటన ఒకటి వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని హాసన్ జిల్లాలోని అంచ్ కొప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ నెల 11వ తేదీన కాలిన శరీరాన్ని ఒకటి వెలుగు చూసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడిని హేమంత్ నాయక్ (20)గా గుర్తించారు. ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగిగా పని చేస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. 
 
లక్ష్మీపుర లే ఔట్ సమీపంలో నివాసం ఉండే హేమంత్ దత్తా అనే వ్యక్తి సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ను బుక్ చేసుకున్నాడు. దాన్ని డెలివరీ చేసేందుకు హేమంత్ నాయక్ ఈ నెల 7వ తేదీన హేమంత్ దత్తా ఇంటికి వచ్చాడు. ఫోన్ డెలివరీ చేసేందుకు రూ.46 వేలు చెల్లించాలని కోరాడు. అంత డబ్బు తన వద్ద లేకపోవడంతో డెలీవరీ బాయ్‌ను హేమంత్ దత్తా కత్తితో పొడిచాడు. 
 
ఆ తర్వాత మృతదేహాన్ని ప్యాక్ చేసి ద్విచక్రవాహనంపై పెట్టుకుని రైల్వే స్టేషన్ సమీపంలో పెట్రోల్ పోసి దహనం చేసినట్టు పోలీసులు జరిపిన విచారణలో వెల్లడైంది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు ఈ కేసులోని మిస్టరీని ఛేదించారు. దీంతో హేమంత్ దత్తాను పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

టికెట్ కొట్టు - ఐఫోన్ పట్టు అంటూ వర్జిన్ బాయ్స్ టీమ్ ప్రకటన

వార్ 2 కోసం యష్ రాజ్ ఫిల్మ్స్‌తో చేతులు కలిపిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా చిత్రం పేరు ఓం శాంతి శాంతి శాంతిః

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments