ఒకే రోజున అన్నతమ్ముల పిల్లలు ఆత్మహత్యలు - ఎక్కడ?

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (13:45 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిధిలోని మాచనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అన్నతమ్ముల పిల్లలు ఒకే రోజున ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో ఆ గ్రామంలో విషాదంనెలకొంది. మృతుల్లో ఒకరు యువతికాగా, మరొకరు యువకుడు ఉన్నాడు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని ఎడ్లపల్లి గ్రామానికి చెందిన ఎడ్ల సంగీత అనే యువతి గత కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుంది. నొప్పి నయం చేసుకునేందుకు ఎంతో మంది వైద్యుల వద్ద చూపించినా ఫలితం లేకుండా పోయింది. అదేసమయంలో కడపునొప్పి కూడా రోజురోజుకూ ఎక్కువైసాగింది. ఈ నొప్పిని భరించలేని సంగీత ఇంట్లోనే ఉన్న పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచింది. 
 
అలాగే, ఇదే గ్రామానికి చెందిన ఎడ్ల భాస్కర్ అనే యువకుడు కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతూ గత కొంతకాలంగా వైద్యం చేయించుకుంటున్నారు. కానీ, వ్యాధి మాత్రం ఎంతకీ నయం కాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి లోనైన ఆత్మహత్య చేసుకున్నాడు. ఎడ్ల సంగీత, ఎడ్ల భాస్కర్‌లు ఒకే గ్రామానికి చెందిన అన్నతమ్ముల పిల్లలు కావడంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

తర్వాతి కథనం
Show comments