ఒకే రోజున అన్నతమ్ముల పిల్లలు ఆత్మహత్యలు - ఎక్కడ?

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (13:45 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిధిలోని మాచనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అన్నతమ్ముల పిల్లలు ఒకే రోజున ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో ఆ గ్రామంలో విషాదంనెలకొంది. మృతుల్లో ఒకరు యువతికాగా, మరొకరు యువకుడు ఉన్నాడు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని ఎడ్లపల్లి గ్రామానికి చెందిన ఎడ్ల సంగీత అనే యువతి గత కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుంది. నొప్పి నయం చేసుకునేందుకు ఎంతో మంది వైద్యుల వద్ద చూపించినా ఫలితం లేకుండా పోయింది. అదేసమయంలో కడపునొప్పి కూడా రోజురోజుకూ ఎక్కువైసాగింది. ఈ నొప్పిని భరించలేని సంగీత ఇంట్లోనే ఉన్న పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచింది. 
 
అలాగే, ఇదే గ్రామానికి చెందిన ఎడ్ల భాస్కర్ అనే యువకుడు కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతూ గత కొంతకాలంగా వైద్యం చేయించుకుంటున్నారు. కానీ, వ్యాధి మాత్రం ఎంతకీ నయం కాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి లోనైన ఆత్మహత్య చేసుకున్నాడు. ఎడ్ల సంగీత, ఎడ్ల భాస్కర్‌లు ఒకే గ్రామానికి చెందిన అన్నతమ్ముల పిల్లలు కావడంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments