Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా దుప్పట్లో చుట్టి

Webdunia
బుధవారం, 3 మే 2023 (15:41 IST)
కడప జిల్లాలో ఓ అమానుష ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. చనిపోయిన కన్నతండ్రి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాల్సిన కుమారుడు.. ఆ పని చేయకుండా, శవాన్ని దుప్పట్లో చుట్టి చెట్ల పొదల్లో విసిరేశాడు. కొద్ది రోజుల తర్వాత కుళ్లిన శవం వాసన రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. 
 
ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని దువ్వూరు మండలం సింగనపల్లెకు చెందిన బొమ్ము చిన్నపుల్లారెడ్డి (62) అనే వ్యక్తి కుమారుడు రాజశేఖర్‌ రెడ్డి ఓ ప్రైవేటు పాఠశాల బస్సు క్లీనర్‌‌గా పని చేస్తున్నాడు. చిన్నపుల్లారెడ్డి కొన్నేళ్లుగా క్షయతో బాధపడుతుంటే కడప సమీపంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేర్పించిన రాజశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్లిపోయాడు. ఆసుపత్రి సిబ్బంది పలుమార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో అదే నెల 23న రాజశేఖర్‌ రెడ్డి ఆసుపత్రికి వెళ్లాడు. వైద్య సిబ్బంది చిన్నపుల్లారెడ్డిని డిశ్చార్జి చేయగా... ఆసుపత్రి దగ్గరే ఆయన మృతి చెందాడు. 
 
తండ్రి మృతదేహానికి ఆసుపత్రికి చెందిన దుప్పటిని చుట్టిన రాజశేఖర్‌ రెడ్డి... ఓ ఆటోను బాడుగకు మాట్లాడుకుని అందులోకి చేర్చాడు. మార్గంమధ్యలో గువ్వల చెరువు ఘాట్‌ రోడ్డులోకి తీసుకెళ్లి పొదల్లో పడేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ ప్రాంతంలో దుర్వాసన వస్తుండటంతో గత నెల 29న పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. వారు గాలించి కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు.
 
సంఘటన స్థలంలో ఉన్న దుప్పటిపై లోగోను పరిశీలించిన పోలీసులు... ఆసుపత్రికి వెళ్లి విచారించగా విషయం బయటపడింది. అంత్యక్రియలకు డబ్బుల్లేకనే మృతదేహాన్ని పడేసినట్లు నిందితుడు చెప్పాడు. తండ్రి మృతదేహాన్ని ఇలా నిర్లక్ష్యంగా వదిలేసిన రాజశేఖర్‌ రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు పోలీసులు వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

35 చిన్న కథ కాదు ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందన్నారు : శ్వాగ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్

ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్... ప్రధాని మోడీకి ధన్యవాదాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments