Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో భార్యతో గొడవ - కన్న కొడుకుని చంపేసిన తండ్రి

Webdunia
మంగళవారం, 16 మే 2023 (10:51 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌‍లో దారుణం జరిగింది. రెండో భార్యతో గొడవపడిన తండ్రి.. కన్నబిడ్డను చంపేశాడు. మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ, కొడుకు విషయంలో రెండో భార్యతో గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన తండ్రి.. తన కుమారుడుని చంపేశాడు. రెండో భార్యతో తన సంసారం సాఫీగా సాగిపోయేందుకు వీలుగా ఏడేళ్ల పిల్లాడని చంపేశాడు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఇండోర్‌లోని తేజాజీ నగర్ ఏరియాలో ఉంటున్న శశిపాల్ ముండే (26) అనే వ్యక్తి మొదటి భార్య చనిపోయింది. మొదటి భార్య - శశిపాల్‌కు మూడేళ్ళ కుమారుడు ఉన్నాడు. భార్య చనిపోవడంతో శశిపాల్ ఇటీవల రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే, కొడుకును చూసుకునే విషయంలో ఆయన రెండో భార్యకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. 
 
ఈ క్రమంలో పిల్లాడిని తాను చూసుకోలేనని చెప్పి శశిపాల్ రెండో భార్య తన పుట్టింటింకి వెళ్లిపోయింది. శశిపాల్ మొదటి భార్య కొడుకు ఉన్నంతవరకు తాను కాపురానికిరానంటూ తేల్చి చెప్పింది. దీంతో విసిగిపోయిన శశిపాల్.. కన్న కుమారుడిని కత్తితో పొడిచి చంపేశాడు. చుట్టుపక్కల వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసి పరారీలో ఉన్న శశిపాల్ కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments