Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాలో భార్యను హత్య చేసి హైదరాబాద్ నగరానికి వచ్చేసిన భర్త!

ఠాగూర్
ఆదివారం, 10 మార్చి 2024 (15:03 IST)
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళ ఆస్ట్రేలియాలో హత్యకుగురైంది. ఆమె మృతదేహం ఊరి చివరన ఉన్న డస్ట్ బిన్‌లో గుర్తించారు. మృతురాలిని చైతన్య మాధగానిగా గుర్తించారు. ఈ దారుణం విక్టోరియాలోని బక్లీలో వెలుగు చూసింది. చైతన్య హత్య గురైన విషయాన్ని ఆమె భర్తకు చెప్పేందుకు పోలీసులు ప్రయత్నించగా, ఆమె భర్త అప్పటికే ఆస్ట్రేలియాను విడిచి భారత్‌కు వచ్చేసినట్టు తేలింది. దీంతో భార్యను భర్తే హత్య చేసి భారత్‌కు పారిపోయివుంటాడని పోలీసులు బలంగా నమ్ముతున్నారు. 
 
విక్టోరియా పోలీసులు వెల్లడించిన సమాచారం మేరకు.. బక్లీ శివార్లలోని చెట్ల మధ్య అనుమానాస్పదంగా కనిపించిన ఓ డస్ట్ బిన్ గురించి స్థానికులు సమాచారం అందించారు. ఆ వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ డస్ట్ బిన్‌ను ఓపెన్ చేసి చూడగా లోపల ఓ మహిళ మృతదేహం కనిపించింది.  ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో ఆ మహిళ చనిపోయినట్టుగా గుర్తించారు. ఇదే హత్యేనని, హంతకుడు ఆమెను వేరే చోట చంపి... మృతదేహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉంటాడని పోలీసులు తెలిపారు. చైతన్య భర్త అశోక్ రాజ్‌కు సమాచారం అందించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైందన్నారు. 
 
మిర్కావేలోని పాయింట్‌కు కుక్‌‍లో అశోక్, చైతన్య నివసించే ఇంటికి వెళ్లగా ఫ్లాట్‌కు తాళం వేసి ఉందని, అశోక్ ఇటీవలే ఇండియాకు వెళ్లినట్టు గుర్తించారు. దీంతో చైతన్య హత్యలో అశోక్‌ ప్రమేయం ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి ఇతరాత్రా కోణాల్లో పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments