అంగవైకల్యంతో పుట్టిన బిడ్డను చంపుకోలేక 22 అంతస్తుల నుంచి దూకేసిన తల్లి

Webdunia
మంగళవారం, 17 జనవరి 2023 (13:23 IST)
అంగవైకల్యంతో పుట్టిన బిడ్డను చూస్తూ ఆ తల్లి మనస్సు తల్లడిల్లిపోయింది. అలాగని అతన్ని చంపుకోలేక, పోషించనూ లేక కుమిలిపోయింది. పైగా, అంగవైక్యలంతో పుట్టిన బిడ్డను చూసి ఆమె భర్త నిరాదారణకు గురిచేశాడు. ఆ పుట్టిన బిడ్డను వదిలించుకోవాలంటూ భార్యను భర్త నిత్యం వేధించసాగాడు. అలా మూడేళ్ల సమయం గడిచిపోయింది. అయినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా, భర్తను నమ్మి హైదరాబాద్ వచ్చిన పాపానికి ఆ మహిళకు నానాటికీ వేధింపులు ఎక్కువై పోయాయి. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. అంతే.. 22వ అంతస్తు నుంచి దూకి అత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. 
 
కాకినాడకు చెందిన నేమాని శ్రీధర్‌కు సర్పవరంకు చెందిన స్వాతి అనే మహిళతో గత 2013లో వివాహం జరిగింది. మూడేళ్ల తర్వాత ఈ దంపతులకు కుమారుడు పుట్టాడు. అయితే మానసిక వైకల్యంతో పుట్టడంతో కొడును శ్రీధర్ దరిచేరనీయలేదు. బిడ్డ తనకు వద్దంటూ భార్యతో గడవపడసాగాడు. దీంతో స్వాతి పుట్టింటిలోనే ఉండిపోయింది. అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకోసాగింది. అయినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా, భార్యను వేధించసాగాడు. 
 
ఈ క్రమంలో మాటమార్చిన శ్రీధర్.. భార్యాబిడ్డలను బాగా చూసుకుంటానని నమ్మించి కాకినాడ నుంచి హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చాడు. కొన్ని రోజుల తర్వా మళ్లీ వేధించసాగాడు. శ్రీధర్ వేధింపులకు అత్తింటివారు కూడా వంతపాడసాగారు. దీంతో విరక్తి చెందిన స్వాది.. మంగళవారం తాము నివసించే అపార్ట్‌మెంటు పైకెక్కి అక్కడ నుంచి కిందకు దూకేసింది. 22వ అంతస్తు పై నుంచి దూకడంతో స్వాతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్వాతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు శ్రీధర్‌ను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments