Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంగవైకల్యంతో పుట్టిన బిడ్డను చంపుకోలేక 22 అంతస్తుల నుంచి దూకేసిన తల్లి

Webdunia
మంగళవారం, 17 జనవరి 2023 (13:23 IST)
అంగవైకల్యంతో పుట్టిన బిడ్డను చూస్తూ ఆ తల్లి మనస్సు తల్లడిల్లిపోయింది. అలాగని అతన్ని చంపుకోలేక, పోషించనూ లేక కుమిలిపోయింది. పైగా, అంగవైక్యలంతో పుట్టిన బిడ్డను చూసి ఆమె భర్త నిరాదారణకు గురిచేశాడు. ఆ పుట్టిన బిడ్డను వదిలించుకోవాలంటూ భార్యను భర్త నిత్యం వేధించసాగాడు. అలా మూడేళ్ల సమయం గడిచిపోయింది. అయినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా, భర్తను నమ్మి హైదరాబాద్ వచ్చిన పాపానికి ఆ మహిళకు నానాటికీ వేధింపులు ఎక్కువై పోయాయి. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. అంతే.. 22వ అంతస్తు నుంచి దూకి అత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. 
 
కాకినాడకు చెందిన నేమాని శ్రీధర్‌కు సర్పవరంకు చెందిన స్వాతి అనే మహిళతో గత 2013లో వివాహం జరిగింది. మూడేళ్ల తర్వాత ఈ దంపతులకు కుమారుడు పుట్టాడు. అయితే మానసిక వైకల్యంతో పుట్టడంతో కొడును శ్రీధర్ దరిచేరనీయలేదు. బిడ్డ తనకు వద్దంటూ భార్యతో గడవపడసాగాడు. దీంతో స్వాతి పుట్టింటిలోనే ఉండిపోయింది. అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకోసాగింది. అయినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా, భార్యను వేధించసాగాడు. 
 
ఈ క్రమంలో మాటమార్చిన శ్రీధర్.. భార్యాబిడ్డలను బాగా చూసుకుంటానని నమ్మించి కాకినాడ నుంచి హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చాడు. కొన్ని రోజుల తర్వా మళ్లీ వేధించసాగాడు. శ్రీధర్ వేధింపులకు అత్తింటివారు కూడా వంతపాడసాగారు. దీంతో విరక్తి చెందిన స్వాది.. మంగళవారం తాము నివసించే అపార్ట్‌మెంటు పైకెక్కి అక్కడ నుంచి కిందకు దూకేసింది. 22వ అంతస్తు పై నుంచి దూకడంతో స్వాతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్వాతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు శ్రీధర్‌ను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

తర్వాతి కథనం
Show comments