Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిని కలిసిన వ్యక్తిని బెదిరించి రూ.60 వేలు దోచుకున్న దుండుగులు..

ఠాగూర్
శుక్రవారం, 10 మే 2024 (10:34 IST)
డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువతిని కలిసిన వ్యక్తిని దుండగులు భయపెట్టి రూ.60 వేలతో పరారైన ఘటన ఒకటి ఫిల్మ్ నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. విజయ్ నగర్ కాలనీకి చెందిన అజిత్ కె ఇమ్మాన్యుయెల్ ఈ నెల6వ తేదీన మసాజ్ రిపబ్లిక్ అనే డిటింగ్ యాప్ చూసి వాట్సాప్ దారా ఓ యువతితో చాటింగ్ చేశాడు. అదేరోజు సాయంత్రం గోల్గొండ ప్రాంతానికి యువతిని కలిసేందుకు కారులో వెళ్లాడు. ఆ తర్వాత ఇద్దరూ కారులో వెళ్దామనుకుంటుండగా ముగ్గురు వచ్చి కారులో ఎక్కారు. ఇంతలో యువతి జారుకుంది. 
 
మీరు వ్యభిచారానికి వచ్చారు.. కదా అంటూ అతడిని బెదిరించారు. పోలీసుల వద్దకు తీసుకెళ్తామని కేసులు నమోదు చేయిస్తామని, మీడియాకు తెలియజేసి బండారం బహిర్గతం చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో భయపడిపోయిన ఆ జంట... తమను వదిలివేయాలంటూ ప్రాధేయపడటంతో రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఇక చేసేదేం లేక తన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.60 వేల నగదును వారి క్యూఆర్ కోడ్‌కు స్కాన్ ద్వారా బదిలీ చేయించుకుని అతని కారులోనే మణికొండవైపు ప్రయాణించి రోడ్డు పక్కన ఆపి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments