Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదారాబాద్ మైనర్ బాలిక రేప్ కేసులో హోం మంత్రి మనవడు?

Webdunia
శనివారం, 4 జూన్ 2022 (13:46 IST)
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఓ కారులో మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఓ సంచలన విషయాన్ని గుర్తించారు. ఈ మైనర్ బాలిక అత్యాచారం కేసులో ఆ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ మనవడు పుర్టాన్ అహ్మద్ ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. పుర్టాన్ అహ్మద్ తన స్నేహితులకు అమ్నేషియా పబ్‌లో బ్యాచిలర్ పార్టీ ఇచ్చారనే విషయం వెలుగులోకి వచ్చింది. 
 
అయితే, ఈ ఆరోపణలపై పుర్టాన్ అహ్మద్ తోసిపుచ్చాడు. తనకు ఆ గ్యాంగ్ రేప్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. గ్యాంగ్ రేప్ జరిగినట్టుగా భావిస్తున్న రోజున తాను మినిస్టర్ క్వార్టర్స్‌లో ఉన్నానని వెల్లడించాడు. పైగా, తాను ఆ రోజు ఎవరికీ ఎలాంటి బ్యాచిలర్ పార్టీ ఇవ్వలేదని స్పష్టం చేశాడు. పార్టీలో పాల్గొన్నవారు, మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినవారు ఎవరో తనకు తెలియదని చెప్పారు. అదేసమయంలో తనపై ఆరోపణలు చేసేవారు నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. 
 
ఇదిలావుంటే ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు గుర్తించారు. వారిలో ముగ్గురిని అరెస్టు చేయగా, వీరిలో ఇద్దరు మైనర్లు ఉండటం గమనార్హం. మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

సోమిరెడ్డి కోడలు శృతి రెడ్డి తో కలిసి డిజిటల్ క్లాస్ రూంను ప్రారంభించిన మంచు లక్ష్మి

Deverakonda: తిరుపతిలో దేవరకొండ కింగ్‌డమ్ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

Sunny: సన్నీ లియోన్ నటించిన త్రిముఖ నుంచి ఐటెం సాంగ్ గిప్పా గిప్పా షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తర్వాతి కథనం