Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదారాబాద్ మైనర్ బాలిక రేప్ కేసులో హోం మంత్రి మనవడు?

Webdunia
శనివారం, 4 జూన్ 2022 (13:46 IST)
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఓ కారులో మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఓ సంచలన విషయాన్ని గుర్తించారు. ఈ మైనర్ బాలిక అత్యాచారం కేసులో ఆ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ మనవడు పుర్టాన్ అహ్మద్ ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. పుర్టాన్ అహ్మద్ తన స్నేహితులకు అమ్నేషియా పబ్‌లో బ్యాచిలర్ పార్టీ ఇచ్చారనే విషయం వెలుగులోకి వచ్చింది. 
 
అయితే, ఈ ఆరోపణలపై పుర్టాన్ అహ్మద్ తోసిపుచ్చాడు. తనకు ఆ గ్యాంగ్ రేప్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. గ్యాంగ్ రేప్ జరిగినట్టుగా భావిస్తున్న రోజున తాను మినిస్టర్ క్వార్టర్స్‌లో ఉన్నానని వెల్లడించాడు. పైగా, తాను ఆ రోజు ఎవరికీ ఎలాంటి బ్యాచిలర్ పార్టీ ఇవ్వలేదని స్పష్టం చేశాడు. పార్టీలో పాల్గొన్నవారు, మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినవారు ఎవరో తనకు తెలియదని చెప్పారు. అదేసమయంలో తనపై ఆరోపణలు చేసేవారు నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. 
 
ఇదిలావుంటే ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు గుర్తించారు. వారిలో ముగ్గురిని అరెస్టు చేయగా, వీరిలో ఇద్దరు మైనర్లు ఉండటం గమనార్హం. మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం