Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదారాబాద్ మైనర్ బాలిక రేప్ కేసులో హోం మంత్రి మనవడు?

Webdunia
శనివారం, 4 జూన్ 2022 (13:46 IST)
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఓ కారులో మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఓ సంచలన విషయాన్ని గుర్తించారు. ఈ మైనర్ బాలిక అత్యాచారం కేసులో ఆ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ మనవడు పుర్టాన్ అహ్మద్ ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. పుర్టాన్ అహ్మద్ తన స్నేహితులకు అమ్నేషియా పబ్‌లో బ్యాచిలర్ పార్టీ ఇచ్చారనే విషయం వెలుగులోకి వచ్చింది. 
 
అయితే, ఈ ఆరోపణలపై పుర్టాన్ అహ్మద్ తోసిపుచ్చాడు. తనకు ఆ గ్యాంగ్ రేప్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. గ్యాంగ్ రేప్ జరిగినట్టుగా భావిస్తున్న రోజున తాను మినిస్టర్ క్వార్టర్స్‌లో ఉన్నానని వెల్లడించాడు. పైగా, తాను ఆ రోజు ఎవరికీ ఎలాంటి బ్యాచిలర్ పార్టీ ఇవ్వలేదని స్పష్టం చేశాడు. పార్టీలో పాల్గొన్నవారు, మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినవారు ఎవరో తనకు తెలియదని చెప్పారు. అదేసమయంలో తనపై ఆరోపణలు చేసేవారు నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. 
 
ఇదిలావుంటే ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు గుర్తించారు. వారిలో ముగ్గురిని అరెస్టు చేయగా, వీరిలో ఇద్దరు మైనర్లు ఉండటం గమనార్హం. మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం