Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో దారుణం : బ్యాట్‌తో కొట్టి.. కత్తులతో గొంతుకోసి హత్య

ఠాగూర్
శుక్రవారం, 16 మే 2025 (09:59 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. స్థానిక నాంపల్లిలో రౌడీ షీటర్ అయాన్ ఖురేషీ హత్యకు గురయ్యాడు. ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కోర్టు నుంచి తిరిగి వస్తుండగా ఐదుగురు దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. బ్యాట్‌తో కొట్టి, కత్తులతో గొంతుకోసి అతి కిరాతకంగా చంపేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చంద్రాయణగుట్టకు చెందిన అయాన్ ఖురేషీ అనే వ్యక్తిపై రౌడీషీట్ ఉంది. ఓ కేసు నిమిత్తం నాంపల్లి కోర్టులో హాజరై తిరిగి ఇంటికి వెళుతున్నాడు. దీన్ని అదనుగా భావించిన ప్రత్యర్థులు ఖురేషీ ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి వద్దకు రాగానే, ఒక్కసారిగా దాడి చేశారు. మొత్తం ఐదుగురు దుండగులు ఖురేషీని క్రికెట్ బ్యాట్‌తో తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత కత్తులతో గొంతుకోసి, పొట్టలో విచక్షణారహితంగా పొడిచి హతమార్చారు. నిందితులు హత్యకు ఉపయోగించిన బ్యాట్, కత్తులను సంఘటనా స్థలంలోనే వదిలి పరారయ్యారు. 
 
దీనిపై సమాచారం అందుకున్న నాంపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత ఆ దర్శకుడుతో ప్రేమలో ఉందా? హీరోయిన్ మేనేజరు ఏమంటున్నారు?

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments