చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న మెట్రో రైల్ డ్రైవర్

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (09:55 IST)
అప్పుల బాధను భరించలేక ఓ హైదరాబాద్ మెట్రో రైలు డ్రైవర్ ఒకరు చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నగరంలోని గోల్నాకలో నివసించే తుంకి సందీప్ రాజ్ (25) అనే వ్యక్తి నాగోలులో మెట్రో రైలు డ్రైవరుగా పని చేస్తున్నాడు. ఈయన కుటుంబ అవసరాల నిమిత్తం అనేక మంది వద్ద అప్పులు చేశారు. 
 
అవి చివరకు కొండంత చేరాయి. వీటిని తీర్చే మార్గం లేకపోవడంతో గత కొన్ని రోజులుగా తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. పైగా, అప్పులు తీర్చే మార్గం లేక, అప్పులు ఇచ్చిన వారికి ముఖం చూపించలేక ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాడు. 
 
ఈ నేపథ్యంలో శనివారం రాత్రి తన తల్లికి ఫోన్ చేసి ఈ రోజు ఇంటికి రానని, డిపోలోనే ఉండిపోతానని చెప్పాడు. అయితే, ఆదివారం ఉదయం ఇబ్రహీంపట్నంలో సందీప్ రాజ్ మృతదేహం కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హతాశులయ్యారు. 
 
తన కుమారుడు ఇకలేరన్న విషయాన్ని తెలుసుకున్ని తల్లి కుమిలిపోతు కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. అయితే, తాను శనివారం ఆత్మహత్య చేసుకుంటానని తన స్నేహితుడు వెంకటేష్‌కు సందీప్ చేసిన వాట్సాప్ సందేశాన్ని పోలీసుల విచారణలో వెల్లడైంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments