Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొమ్మిదో తరగతి చదివే కుమార్తెపై కన్నతండ్రి అత్యాచారం..

ఠాగూర్
శుక్రవారం, 5 జనవరి 2024 (16:59 IST)
హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లలో దారుణం జరిగింది. తొమ్మిదో తరగతి చదవుతున్న కన్నబిడ్డపై కామంతో కళ్లు మూసుకునిపోయిన కన్నతండ్రి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘాతుకానికి పాల్పడింది బీహార్ నుంచి నగరానికి పొట్టకూటి కోసం వలస వచ్చిన కసాయి వ్యక్తి కావడం గమనార్హం. 
 
బీహార్ రాష్ట్రానికి చెందిన ఒక ఫ్యామిలీ కుత్బుల్లాపూర్‌కు కొన్నేళ్ళ క్రితం వలస వచ్చింది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె తొమ్మిదో తరగతి చదువుతుంది. వయసు 14 యేళ్ళు. అయితే, కరోనా మహమ్మారి కారణంగా ఆ బాలిక పాఠశాలకు వెళ్ళకుండా ఇంటిపట్టునే ఉంటుంది. ఈ క్రమంలో ఇంట్లోనే ఉంటున్న వయసుకొచ్చిన కుమార్తెపై కన్నేసిన కసాయి తండ్రి.. నయానా భయానో లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడసాగాడు. 
 
పైగా, ఈ విషయం తల్లితో సహా ఎవరికీ చెప్పొద్దంటూ బెదిరించాడు. అయితే రోజు రోజుకూ తండ్రి ఆగడాలు హెచ్చుమీరిపోవడంతో కన్నతల్లి దృష్టికి తీసుకెళ్లింది. అయితే కన్నబిడ్డ మాటలు ఆ తల్లి నమ్మలేదు. పైగా తండ్రిపై లేనిపోనివి చెప్పొద్దంటూ కోపగించుకుంది.  ఆ తర్వాత తన స్నేహితుడి ద్వారా పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments