Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీటింగుల పేరుతో సీఈవో వక్రబుద్ధి... ఉద్యోగిని ఫిర్యాదు...

ఠాగూర్
ఆదివారం, 4 ఫిబ్రవరి 2024 (09:09 IST)
మీటింగుల పేరుతో ఓ సీఈవో తనలోని వక్రబుద్ధిని ప్రదర్శించాడు. అతని చేష్టలను భరించలేని ఓ ఉద్యోగిని నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. నగరానికి చెందిన ఓ యువతి అమీర్‌పేటలోని ఓ కంపెనీలో హెచ్ఆర్ అండ్ లీగల్ మేనేజరుగా పనిచేస్తుంది. అమెరికాలో అంటున్న ఏద కంపెనీ సీఈవో తొండెపుచంద్రతో జూమ్ మీటింగ్‌లో పాల్గొంటూ వచ్చేది. ఈ సమావేశాల్లోనే ఆయన అసభ్యంగా ప్రవర్తించసాగాడు. 
 
ఈ నేపథ్యంలో గత యేడాది డిసెంబరు నెలలో అమెరికా నుంచి నగరానికి చెందిన చంద్ర.. జనవరి నెల 23వ తేదీన అమీర్‌పేటలోని కార్యాలయంలో మీటింగ్ ఏర్పాటు చేయగా, ఆ యువతి పాల్గొంది. అపుడు ఆమెను వేధించాడు. జనవరి 2వ తేదీన నెక్లెస్ రోడ్డులోని ఓ రెస్టారెంట్‌కు పిలిపించి తన కోరిక తీర్చాలంటూ ఒత్తిడి చేయగా, అందుకు ఆమె నిరాకరించింది. పైగా, తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది. జీతంతో పాటు ఇతర పత్రాలు ఇవ్వాలని కోరింది. కానీ, ఆమె కోరికను చంద్ర తిరస్కరించి, మళ్లీ వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్టీఆర్ అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి.. భారతరత్నతో సత్కరించాలి

బాలీవుడ్‌కు బైబై చెప్పనున్న కీర్తి సురేష్... ఆ కొత్త ఛాన్స్ కలిసొస్తుందా?

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి.. నిందితుడు బిజోయ్ దాస్ విషయాలు.. ఎక్కడ నుంచి వచ్చాడంటే?

Bulli Raju: సంక్రాంతికి వస్తున్నాం.. బుల్లిరాజుకు పవన్ కల్యాణ్ ఇష్టమట...

సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తి బంగ్లాదేశ్ జాతీయుడే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments