మీటింగుల పేరుతో సీఈవో వక్రబుద్ధి... ఉద్యోగిని ఫిర్యాదు...

ఠాగూర్
ఆదివారం, 4 ఫిబ్రవరి 2024 (09:09 IST)
మీటింగుల పేరుతో ఓ సీఈవో తనలోని వక్రబుద్ధిని ప్రదర్శించాడు. అతని చేష్టలను భరించలేని ఓ ఉద్యోగిని నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. నగరానికి చెందిన ఓ యువతి అమీర్‌పేటలోని ఓ కంపెనీలో హెచ్ఆర్ అండ్ లీగల్ మేనేజరుగా పనిచేస్తుంది. అమెరికాలో అంటున్న ఏద కంపెనీ సీఈవో తొండెపుచంద్రతో జూమ్ మీటింగ్‌లో పాల్గొంటూ వచ్చేది. ఈ సమావేశాల్లోనే ఆయన అసభ్యంగా ప్రవర్తించసాగాడు. 
 
ఈ నేపథ్యంలో గత యేడాది డిసెంబరు నెలలో అమెరికా నుంచి నగరానికి చెందిన చంద్ర.. జనవరి నెల 23వ తేదీన అమీర్‌పేటలోని కార్యాలయంలో మీటింగ్ ఏర్పాటు చేయగా, ఆ యువతి పాల్గొంది. అపుడు ఆమెను వేధించాడు. జనవరి 2వ తేదీన నెక్లెస్ రోడ్డులోని ఓ రెస్టారెంట్‌కు పిలిపించి తన కోరిక తీర్చాలంటూ ఒత్తిడి చేయగా, అందుకు ఆమె నిరాకరించింది. పైగా, తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది. జీతంతో పాటు ఇతర పత్రాలు ఇవ్వాలని కోరింది. కానీ, ఆమె కోరికను చంద్ర తిరస్కరించి, మళ్లీ వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

వార్నింగ్ ఇచ్చే G.O.A.T సినిమా తీసుకున్నా : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments