Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య పుట్టింటికి వెళ్ళింది... ఏకాకినయ్యా.. అందుకే చనిపోతున్నా...

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2022 (10:38 IST)
ఓ ఆటో డ్రైవర్ పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బలవన్మరణానికి పాల్పడేముందు ఆయన సెల్ఫీ వీడియో తీశాడు. ఇందులో తాను చేసిన తప్పును తెలుసుకున్నాడు. కుటుంబ సభ్యులను బాధపెట్టినట్టు బోరున విలపించాడు. తాను తప్పు చేశానని, అందుకే చనిపోతున్నట్టు ఆ వీడియోలో పేర్కొన్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ నగరం చౌదరి గూడకు చెందిన కె.నరసింహ - లక్ష్మమ్మ దంపతులు దినసరి కూలీలు. వీరి కుమారుడు రవి (35) ఆటోడ్రైవర్‌. పదేళ్ల క్రితం వివాహమైంది. మద్యానికి బానిసకావడంతో మనస్పర్థల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. జీవితంపై విరక్తి చెందిన రవి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడికి ఎనిమిదేళ్లలోపు కుమార్తె, కుమారుడు ఉన్నారు.
 
ఆయన పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముందుగా ఓ సెల్ఫీ వీడియో తీశాడు. అందులో "మద్యానికి బానిసయ్యాను. నా ప్రవర్తనలో మార్పు వస్తుందని నా భార్య పదేళ్లు నాతో కాపురం చేసింది. నాలో మార్పు రాకపోవడంతో.. పుట్టింటికి వెళ్లిపోయింది. ఏకాకినయ్యా. తప్పంతా నాదే. అందుకే చనిపోతున్నా" అంటూ పురుగు మందు తాగాడు. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. శంషాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varalakshmi: కొంత ఇస్తే అది మళ్ళీ ఫుల్ సర్కిల్ లా వెనక్కి వస్తుంది: వరలక్ష్మీ, నికోలయ్‌ సచ్‌దేవ్‌

Tuk Tuk: సూపర్‌ నేచురల్‌, మ్యాజికల్‌ పవర్‌ ఎలిమెంట్స్‌ సినిమా టుక్‌ టుక్‌

కథ, కథనాల మీదే నడిచే సినిమా రా రాజా చూసి సక్సెస్ చేయాలి: దర్శకుడు బి. శివ ప్రసాద్

నేను చెప్పింది కాకపోతే ఇకపై జడ్జిమెంట్ ఇవ్వను : రాజేంద్రప్రసాద్

Chitra Purushotham: ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్‌కు ఫోజులిచ్చి ఆన్‌లైన్‌‌లో వైరల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments