Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య పుట్టింటికి వెళ్ళింది... ఏకాకినయ్యా.. అందుకే చనిపోతున్నా...

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2022 (10:38 IST)
ఓ ఆటో డ్రైవర్ పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బలవన్మరణానికి పాల్పడేముందు ఆయన సెల్ఫీ వీడియో తీశాడు. ఇందులో తాను చేసిన తప్పును తెలుసుకున్నాడు. కుటుంబ సభ్యులను బాధపెట్టినట్టు బోరున విలపించాడు. తాను తప్పు చేశానని, అందుకే చనిపోతున్నట్టు ఆ వీడియోలో పేర్కొన్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ నగరం చౌదరి గూడకు చెందిన కె.నరసింహ - లక్ష్మమ్మ దంపతులు దినసరి కూలీలు. వీరి కుమారుడు రవి (35) ఆటోడ్రైవర్‌. పదేళ్ల క్రితం వివాహమైంది. మద్యానికి బానిసకావడంతో మనస్పర్థల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. జీవితంపై విరక్తి చెందిన రవి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడికి ఎనిమిదేళ్లలోపు కుమార్తె, కుమారుడు ఉన్నారు.
 
ఆయన పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముందుగా ఓ సెల్ఫీ వీడియో తీశాడు. అందులో "మద్యానికి బానిసయ్యాను. నా ప్రవర్తనలో మార్పు వస్తుందని నా భార్య పదేళ్లు నాతో కాపురం చేసింది. నాలో మార్పు రాకపోవడంతో.. పుట్టింటికి వెళ్లిపోయింది. ఏకాకినయ్యా. తప్పంతా నాదే. అందుకే చనిపోతున్నా" అంటూ పురుగు మందు తాగాడు. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. శంషాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments