Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య పుట్టింటికి వెళ్ళింది... ఏకాకినయ్యా.. అందుకే చనిపోతున్నా...

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2022 (10:38 IST)
ఓ ఆటో డ్రైవర్ పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బలవన్మరణానికి పాల్పడేముందు ఆయన సెల్ఫీ వీడియో తీశాడు. ఇందులో తాను చేసిన తప్పును తెలుసుకున్నాడు. కుటుంబ సభ్యులను బాధపెట్టినట్టు బోరున విలపించాడు. తాను తప్పు చేశానని, అందుకే చనిపోతున్నట్టు ఆ వీడియోలో పేర్కొన్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ నగరం చౌదరి గూడకు చెందిన కె.నరసింహ - లక్ష్మమ్మ దంపతులు దినసరి కూలీలు. వీరి కుమారుడు రవి (35) ఆటోడ్రైవర్‌. పదేళ్ల క్రితం వివాహమైంది. మద్యానికి బానిసకావడంతో మనస్పర్థల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. జీవితంపై విరక్తి చెందిన రవి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడికి ఎనిమిదేళ్లలోపు కుమార్తె, కుమారుడు ఉన్నారు.
 
ఆయన పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముందుగా ఓ సెల్ఫీ వీడియో తీశాడు. అందులో "మద్యానికి బానిసయ్యాను. నా ప్రవర్తనలో మార్పు వస్తుందని నా భార్య పదేళ్లు నాతో కాపురం చేసింది. నాలో మార్పు రాకపోవడంతో.. పుట్టింటికి వెళ్లిపోయింది. ఏకాకినయ్యా. తప్పంతా నాదే. అందుకే చనిపోతున్నా" అంటూ పురుగు మందు తాగాడు. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. శంషాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments