Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు మైనర్లు

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (15:40 IST)
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం, సైదాబాద్‌లో ఐదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్ కుర్రోళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ముగ్గురి వయసు 16, 11, 9 యేళ్లుగా ఉన్నాయి. వీరంతా కలిసి ఐదేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణం వివరాలను పరిశీలిస్తే, సైదాబాద్‌లో ఉంటున్న ఓ దంపతులకు ఆరు, ఐదేళ్ల వయస్సున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రోజూ ఉపాధి కోసం కూలీ పనులకు వెళ్లి సాయంత్రానికి ఇంటికి వస్తుంటారు. 
 
అలాగే, ఇద్దరు మైనర్ బాలికలు కూడా ఉదయం అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లి మధ్యాహ్నానికి ఇంటికి వస్తుంటారు. ఈ క్రమంలో గత మూడు రోజులుగా పెద్దమ్మాయి జ్వరంతో బాధపడుతూ ఇంటిపట్టునే ఉంటుంది. చిన్నపాప ఒక్కతే అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లి వచ్చేది. అయితే, ఆ పాప టీవీ చూసేందుకు పొరిగింటికి వెళ్లింది. ఆ సమయంలో ముగ్గురు మైనర్లు ఆ బాలికను భవనంమీదకు పిలిచి లైంగికదాడికి తెగబడ్డారు. 
 
ఆ తర్వాత ఆ బాలిక రోదిస్తూ ఇంటికి రాగా, తల్లి నిలదీయడంతో అసలు విషయం వెల్లడించింది. ఈ ఘటనపై బాధిత తల్లిదండ్రులు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక నుంచి స్టేట్మెంట్ తీసుకున్న పోలీసులు ముగ్గురు పోలీసులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జువైనల్ హోంకు తరలించారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments