Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై స్నేహితుడితో అత్యాచారం చేయించిన భర్త

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (12:13 IST)
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అవి తారాస్థాయికి వెళ్లడంతో ఇక తన భర్తతో కలిసి బ్రతకడం సాధ్యం కాదని నిర్ణయించుకున్న భార్య విడాకుల కోసం కోర్టులో పిటీషన్ వేసింది. తనపై భార్య ఫిర్యాదు చేయడంతో రగిలిపోయాడు భర్త. తన స్నేహితులు ముగ్గుర్ని వెంటబెట్టుకుని వెళ్లి వారితో అత్యాచారం చేయించాడు.
 
పూర్తి వివరాలు చూస్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథి జిల్లాలో బజార్ శుక్లా పోలీసు స్టేషను పరిధిలో ఓ వివాహిత భర్తతో గొడవల కారణంగా విడాకులకు దరఖాస్తు పెట్టుకుంది. భార్య తనపై ఫిర్యాదు చేసిందన్న ఆగ్రహంతో ఆమె భర్త ఈ నెల 24న తన ముగ్గురు స్నేహితులను వెంటబెట్టుకుని భార్య వుంటున్న ఇంటికి వెళ్లాడు.
 
ఆ సమయంలో ఇంట్లో ఆమె ఒక్కతే ఒంటరిగా వుండటంతో దాడి చేసారు. ఆ తర్వాత ఆమెపై తన స్నేహితుడితో అత్యాచారం చేయించాడు. తనకు నరకం చూపించారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత తనను పెట్రోల్ పోసి తగలపెట్టేందుకు ప్రయత్నించారనీ, తను గట్టిగా కేకలు వేయడంతో పారిపోయారని వివరించింది.
 
ఐతే ఆమె ఫిర్యాదును స్థానిక పోలీసులు పట్టించుకోలేదనీ, చివరికి అమేథీ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయగా వారు స్పందించారని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

తర్వాతి కథనం
Show comments