భర్త ప్రాణాలు తీసిన సీరియల్ చిచ్చు... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2023 (10:46 IST)
టీవీల్లో ప్రసారమయ్యే సీరియల్స్ అనేక జంటల కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. తాజాగా ఓ వ్యక్తి ప్రాణాలు కూడా హరించింది. ఈ ఆశ్చర్యకర, విషాదకర ఘటన తమిలనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరులోలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కడంబత్తూరు గ్రామానికి చెందిన అశీర్వాదం (40) అనే వ్యక్తికి భార్య నిషా, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, నిషాకు సీరియల్స్ చూడటం మహాపిచ్చి. అలాగే, భర్తకు కూడా టీవీలో వచ్చే వివిధ కార్యక్రమాలను చూసే అలవాటు ఉంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి టీవీలో తనకు నచ్చిన ఓ కార్యక్రమాన్ని చూసేందుకు భార్య చేతిలో ఉన్న టీవీ రిమోట్‌ను ఆశీర్వాదం ఆడిగాడు. ఆ సమయంలో టీవీలో వస్తున్న సీరియల్‌ను చూస్తూ.. రిమోట్ ఇచ్చేందుకు నిరాకరంచింది. దీంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. చివరకు అది కాస్తా ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసింది. 
 
దీంతో ఆగ్రహించిన ఆశీర్వాదం... ఇంటి నుంచి బయటకు వెళ్లిపోగా, నిషా సమీపంలో ఉన్న పుట్టింటికి వెళ్లిపోయింది. సోమవారం వేకువజామున ఇంటికి చేరుకున్న ఆశీర్వాదం తన గదిలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఉదయాన్నే ఇంటికి చేరుకున్న నిషా... భర్త ఉరికి వేలాడడం చూసి నిర్ఘాంతపోయింది. బోరున విలపిస్తూ కడంబత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్న ఇట్లు మీ ఎదవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

తర్వాతి కథనం
Show comments