భార్య చికెన్ కూర వండలేదని భర్త ఆత్మహత్య

Webdunia
బుధవారం, 30 మార్చి 2022 (10:15 IST)
కోడి కూర చేసేందుకు భార్య నిరాకరించిందన్న ఆగ్రహంతో ఓ ఆటో రిక్షా డ్రైవర్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండిగల్‌లో ఎం. రతన్‌లాల్‌ (32) శనివారం సాయంత్రం పని ముగించుకుని వచ్చి సమీపంలోని చికెన్ షాపులో చికెన్ కొని కూర వండాలని భార్యకు చెప్పాడు.

 
అయితే కుమార్తెకు చికెన్ గున్యా సోకిందని, ఇంట్లో మాంసాహారం వండనని భార్య చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన రతన్ లాల్ ఇంట్లో వున్న పురుగుల మందు విషాన్ని తాగాడు.

 
భర్త పురుగులు మందు తాగాడన్న విషయాన్ని తెలుసుకున్న భార్య తన ఇంటి పొరుగువారికి, బంధువులకు సమాచారం అందించింది. వారు రతన్ లాల్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments