మిక్సీ వైరును గొంతుకు బిగించి భార్యను చంపేసిన తాపీమేస్త్రీ

ఠాగూర్
శుక్రవారం, 29 ఆగస్టు 2025 (09:07 IST)
మద్యం సేవించేందుకు డబ్బులు ఇవ్వక పోవడంతో భార్యను కట్టుకున్న భార్త హత్య చేశాడు. మిక్సీ వైరును భార్య మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఈ కిరాతక భర్త తాపీమేస్త్రీగా పని చేస్తున్నాడు. ఈ దారుణ ఘటన ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సాలూరు పట్టణానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి తాపీమేస్త్రీగా పనిచేస్తూ మద్యానికి బానిసయ్యాడు. అతనితో పాటు భార్య త్రివేణి(38) కూడా గృహ నిర్మాణ పనులకు వెళ్లేది. వచ్చిన కూలి డబ్బులతో మద్యం తాగేసి తరచూ భార్యతో గొడవ పడేవాడు. బుధవారం రాత్రి మద్యం కోసం భార్యను నగదు అడిగాడు. ఆమె నిరాకరించడంతో మిక్సీ వైరును ఆమె మెడకు చుట్టి నులిమేశాడు. దీంతో ఆమె ఆపస్మారక స్థితికి చేరింది. 
 
కుమారుడు, సోదరి వచ్చి చూసి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. నిందితుడు భార్య మెడలోని బంగారం, ఇంట్లో నగదుతో పరారీ అయ్యాడు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ అప్పలనాయుడు తెలిపారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments