హిజ్రాలు ఇంటిపై దాడి చేస్తారని అవమానం భారంతో ఓ మహిళ ఆత్మహత్య

ఠాగూర్
ఆదివారం, 14 సెప్టెంబరు 2025 (09:42 IST)
కొందరు హిజ్రాలు తమ ఇంటికి వచ్చి దాడి చేశారన్న అవమాన భారంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్ పరిధి గిరిపురంలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. నగరంలోని గిరిపురం జయరాజు వీధికి చెందిన యువకుడు పల్లెపోగు గోపీచంద్ రాడ్ బెండింగ్ పనులకు వెళ్తుంటారు. ఆయన ఓ యువతితో ప్రేమలో ఉన్నారు. అయితే, కొంతకాలంగా గోపీచంద్ మద్యానికి బానిసై.. పనికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నారు. దీంతో ఆ యువతి ఆయనతో మాట్లాడడం మానేసింది. 
 
ఈ క్రమంలో ఈ నెల 10న గోపీచంద్.. ఆమె ఇంటికి వెళ్లి తనతో మాట్లాడాలంటూ గొడవ చేశారు. మరుసటి రోజు ఇరు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో గోపీచంద్.. యువతి మేనమామను చెంపపై కొట్టారు. అతని ఫిర్యాదు మేరకు గోపీచంద్‌ను మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత యువతి మేనమామ తనకు తెలిసిన హిజ్రా సరిత ఎలియాస్ డానియేలుతో పాటు మరో పది మంది హిజ్రాలను తీసుకుని రాత్రి 10 గంటల సమయంలో యువకుడి ఇంటికి వెళ్లారు. 
 
గోపీచంద్ తల్లిదండ్రులు కుమార్ బాబు, సత్యకుమారి (40)లపై దాడి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన సత్యకుమారి ఫ్యాన్‌కు ఉరేసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. ఆమె కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్ వద్ద తమకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments