Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్నం కింద పాతఫర్నీచర్ ఇచ్చారనీ... పెళ్లిని రద్దు చేసిన వరుడు..

Webdunia
మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (11:52 IST)
హైదరాబాద్ నగరంలో ఓ వరుడు అర్థాంతరంగా తన పెళ్లిని రద్దు చేసుకున్నారు. దీనికి ఆయన చెప్పిన కుంటిసాకు.. కట్నంకింద పాత ఫర్నీచర్ ఇచ్చారంటూ ఆరోపిస్తున్నాడు. పెళ్లికి ముందు తాము అడిగినవి వధువు కుటుంబీకులు ఇవ్వకపోవడంతో వరుడు కుటుంబీకులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. దీంతో కట్నం కింద పాత ఫర్నీచర్ ఇచ్చారని ఆరోపిస్తూ పెళ్లిని రద్దు చేసుకున్నారు. దీనిపై వధువు తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
హైదరాబాద్ నగరానికి చెందిన 25 యేళ్ల మహ్మద్ జకీర్... ఓ బస్సుడ్రైవరు. ఆయనకు 22 యేళ్ల హీనా ఫాతిమా అనే యువతితో పెళ్లి నిశ్చయమైంది. వీరి వివాహం ఆదివారం జరగాల్సివుంది. కానీ, ముహూర్త సమయానికి వరుడు రాలేదు. ముహూర్తం దాటిపోయి గంటలు గడిచినా పెళ్లిమండపం వైపు కన్నెత్తి చూడలేదు. చివరకు వధువు తండ్రి పోలీసులను ఆశ్రయించారు. 
 
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... జకీర్‌, అతని కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కట్నం కింద పాత ఫర్నిచర్ ఇచ్చారనీ, ఇదే విషయంపై మాట్లాడేందుకు వధువు ఇంటికి వెళ్లగా వారు నోటికి వచ్చినట్టు మాట్లాడారని పోలీసులకు చెప్పారు. అయినప్పటికీ వరుడిపై వరకట్న నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments