Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి కోసం మనువడిని చంపేసిన తాత.. ఎక్కడ?

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2023 (14:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెస్ట్ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి కోసం మనువడిని సొంత తాత చంపేశాడు. ఆరేళ్ల వయస్సున్న మనువడిని కర్కశంగా కాల్వలో తొక్కి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశాడు. ఈ దారుణం జిల్లాలోని పెంటపాడు మండలం, మీనవల్లూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గ్రామానికి చెందిన పోకల సత్యనారాయణకు బుట్టాయిగూడెం మండలం రామన్నగూడేనికి చెందిన శిరీషతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. తల్లిదండ్రుల నుంచి ఆస్తి తేవాలని భర్త సత్యనారాయణ, మామ నాగేశ్వరరావు (60), అత్త లక్ష్మిలు కలిసి శిరీషను వేధించసాగారు. దీనిపై పెద్ద మనుషుల వద్ద పంచాయితీలు నడుస్తున్నాయి. 
 
ఈ క్రమంలో శిరీష కోర్టుకు వెళ్తే తమ ఆస్తి మనువడు కల్యాణ్ వెంకట్ పేరున వెళ్లిపోతుందని మామ నాగేశ్వరరావు భావించాడు. మనుమడిని అడ్డు తొలగించుకుంటే ఆస్తి మొత్తం తన వద్దే ఉంటుందని దురాలోచన చేశాడు. ఈ నెల 9న పాఠశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న కల్యాణ్‌ను భార్య, కుమారుడి సహకారంతో నాగేశ్వరరావు తనతో బయటికి తీసువెళ్లి కాల్వలో తొక్కి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. 
 
ఇటు కొడుకు కనిపించకపోవడంతో తల్లి శిరీష పెంటపాడు. పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తాతే హత్య చేశాడని గుర్తించారు. ఇందుకు సహకరించిన అతడి భార్య, కుమారుడు సహా ముగ్గురిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments