Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజాంలో ఉపాధ్యాయుడిని కొట్టి చంపేసిన దుండగులు...

Webdunia
ఆదివారం, 16 జులై 2023 (12:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా రాజాంలో ప్రభుత్వ పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈయన టీడీపీ మద్దతుదారుడు కావడమే ఈ హత్యకు కారణమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మృతుడి పేరు ఏగిరెడ్డి కృష్ణ (58). బోలెరో వాహనంతో ఢీకొట్టించి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. 
 
స్థానిక పోలీసుల కథనం మేరకు.. శనివారం ఉదయం ఇంటి నుంచి కృష్ణ తన ద్విచక్ర వాహనంపై బయలుదేరి తెర్లాం మండలం కాలంరాజుపేటలోని పాఠశాలకు వెళుతున్నారు. ఒమ్మి సమీపంలోని కొత్తపేట వద్ద ప్రత్యర్థి వర్గం బోలెరో వాహనంతో ఆయన్ను ఢీకొట్టారు. దీంతో కిందపడిపోయిన కృష్ణపై దాడి చేసి చంపేశారు. చనిపోయేముందు కళ్లలో కారం కొట్టి అక్కడ నుంచి పారిపోయారు. మృతదేహం భయానక స్థితిలో ఉంది. దీంతో కృష్ణది హత్యేనని ఆయన కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు ఆరోపిస్తూ, హత్యా స్థలం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. 
 
దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా, కృష్ణను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్టు తేలింది. మృతుడి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఉద్దవోలుకు మరడాన వెంకట నాయుడు, మోహనరావు, గణపతి, రామస్వామిలపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతుడు గతంలో టీడీపీ తరపున గ్రామ సర్పించిగా కూడా పనిచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments