Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిర్యాదు చేసేందుకు వచ్చిన దళిత బాలికపై పోలీసు అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2023 (16:54 IST)
సమాజానికి రక్షణ కల్పించాల్సిన పోలీసులే కామాంధులుగా మారిపోతున్నారు. ఫిర్యాదు చేసేందుకు ఠాణాకు వచ్చిన ఓ దళిత మహిళపై కామంతో కళ్ళుమూసుకునిపోయిన పోలీసు అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఓ దళిత మహిళను కొందరు అకతాయిలు వేధింపులకు గురిచేస్తూ చంపేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో వారిపై ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వచ్చింది. ఆ సమయంలో ఠాణాలో ఉన్న ఎస్ఐ సుధీర్ కుమార్ పాండేకు తన బాధను వివరించింది. ఆ వెంటనే ఆయన నిందితులను అరెస్టు చేసేందుకు వెళదామని చెప్పి, బాధితురాలిని తన వాహనంలో ఎక్కించుకున్నాడు. అధికారి చెప్పిన మాటలు నమ్మిన అతనితోపాటు వెళ్లింది. దారిలో కారు ఆపి మత్తుమందు కలిపిన శీతలపానీయాన్ని ఆమెతో తాగించాడు. 
 
దీంతో ఆమె అపస్మారకస్థితిలోకి జారుకోవడంతో కారులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ స్పృహలోకి వచ్చిన బాధితురాలు తాను మోసపోయానని గ్రహించి సదరు పోలీసుపై ఫిర్యాదు చేసింది. దీంతో ఉన్నతాధికారులు ఆ కామాంధ ఎస్‌ఐను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. పరారీలో ఉన్న ఎస్ఐ సుధీర్ కుమార్ పాండే కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments