Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకల దొంగలను ఎస్ఎస్ఐ పట్టుకుంటే కత్తులతో నరికి చంపేసారు

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (13:14 IST)
అతడో నిజాయితీగల పోలీస్ ఇన్‌స్పెక్టర్. నేరగాళ్ల గుండెల్లో నిద్రపోతాడు. అలాంటి పోలీసు అధికారిని మేకల దొంగలు అత్యంత దారుణంగా హత్య చేసారు.

 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. తిరుచ్చిలోని తిరువేంబూరు పరిధిలోని నవల్ పట్టు పోలీసు స్టేషనులో ఎస్ఎస్ఐగా 51 ఏళ్ల భూమినాథన్ పనిచేస్తున్నారు. ఆయన తన గస్తీలో భాగంగా చిన్న సూర్యర్ గ్రామ శివార్లలో అర్థరాత్రి వేళ మేకల అరుపులు విన్నాడు. నలుగురు వ్యక్తులు మేకలను దొంగతనం చేసి మోటార్ సైకిళ్లపై పారిపోవడాన్ని గుర్తించాడు. తనతో పాటు గస్తీలో వున్న మరో పోలీసుతో కలిసి వెంబడించారు.

 
కొంతదూరం వెళ్లాక తనతో వచ్చిన పోలీసు అలసిపోయి వెనుదిరిగాడు. కానీ భూమినాథన్ మాత్రం వారిని అదుపులోకి తీసుకున్నాడు. ఆ తర్వాత పోలీసు స్టేషనుకు ఫోన్ చేసి ఎస్సైకి సమాచారం అందించాడు. వెంటనే ఘటనా స్థలానికి రావాలన్నాడు. ఐతే ఈలోపుగా వారిలో ఇద్దరు వెనుదిరిగి కత్తులతో భూమినాథన్ పైన దాడి చేసి హతమార్చారు.

 
ఎస్సై వచ్చేలోపు భూమినాథన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన వెలుగుచూడటంతో పోలీసులంతా ఉలిక్కిపడ్డారు. నిందితుల కోసం వేట ప్రారంభించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. మృతుడి కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments