Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకల దొంగలను ఎస్ఎస్ఐ పట్టుకుంటే కత్తులతో నరికి చంపేసారు

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (13:14 IST)
అతడో నిజాయితీగల పోలీస్ ఇన్‌స్పెక్టర్. నేరగాళ్ల గుండెల్లో నిద్రపోతాడు. అలాంటి పోలీసు అధికారిని మేకల దొంగలు అత్యంత దారుణంగా హత్య చేసారు.

 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. తిరుచ్చిలోని తిరువేంబూరు పరిధిలోని నవల్ పట్టు పోలీసు స్టేషనులో ఎస్ఎస్ఐగా 51 ఏళ్ల భూమినాథన్ పనిచేస్తున్నారు. ఆయన తన గస్తీలో భాగంగా చిన్న సూర్యర్ గ్రామ శివార్లలో అర్థరాత్రి వేళ మేకల అరుపులు విన్నాడు. నలుగురు వ్యక్తులు మేకలను దొంగతనం చేసి మోటార్ సైకిళ్లపై పారిపోవడాన్ని గుర్తించాడు. తనతో పాటు గస్తీలో వున్న మరో పోలీసుతో కలిసి వెంబడించారు.

 
కొంతదూరం వెళ్లాక తనతో వచ్చిన పోలీసు అలసిపోయి వెనుదిరిగాడు. కానీ భూమినాథన్ మాత్రం వారిని అదుపులోకి తీసుకున్నాడు. ఆ తర్వాత పోలీసు స్టేషనుకు ఫోన్ చేసి ఎస్సైకి సమాచారం అందించాడు. వెంటనే ఘటనా స్థలానికి రావాలన్నాడు. ఐతే ఈలోపుగా వారిలో ఇద్దరు వెనుదిరిగి కత్తులతో భూమినాథన్ పైన దాడి చేసి హతమార్చారు.

 
ఎస్సై వచ్చేలోపు భూమినాథన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన వెలుగుచూడటంతో పోలీసులంతా ఉలిక్కిపడ్డారు. నిందితుల కోసం వేట ప్రారంభించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. మృతుడి కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments