Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్మీ ఆఫీసర్‌తో ప్రేయసికి నిశ్చితార్థం, గడ్డి మందు తాగించి ప్రియుడిని చంపేసింది

ఐవీఆర్
శనివారం, 18 జనవరి 2025 (18:50 IST)
టీనేజ్ వయసులో వుండగా తను చదువుకునే కాలేజీలో తన జూనియర్ యువకుడితో ప్రేమలో పడింది ఆమె. అలా వారి ప్రేమాయణం సాగుతుండగానే యువతి తండ్రి ఆమెకి ఓ ఆర్మీ ఆఫీసరుతో నిశ్చితార్థం చేసారు. ఆమె ఆ నిశ్చితార్థాన్ని సమ్మతించడంతో పాటు తన జూనియర్ తో ప్రేమాయణం కూడా సాగించింది. ఐతే పెళ్లి ఘడియలు సమీపించడంతో తన ప్రియుడిని ఎలాగైనా వదిలించుకోవాలన్న ఉద్దేశంతో అతడికి ఆయుర్వేదిక్ మందులో గడ్డి మందు కలిపి తాగించింది. దాంతో అతడు మృతి చెందాడు.
 
పూర్తి వివరాలను చూస్తే... కన్యాకుమారికి చెందిన గ్రీష్మ అనే యువతి తిరువునంతపురంకు చెందిన షారోజ్ రాజుతో 2021 నుంచి స్నేహంగా వుంటూ వస్తోంది. షారోజ్ రాజు ఆమెకి జూనియర్. ఐతే వీరి ఫ్రెండ్ షిప్ కాస్తా ప్రేమకు దారి తీసింది. ఇదిలా సాగుతుండగానే గ్రీష్మ తండ్రి ఆమెకి ఆర్మీ అధికారితో వివాహం చేయాలని నిశ్చయించి విషయాన్ని తన కుమార్తెతో చెప్పాడు. అందుకు ఆమె అంగీకరించింది. కానీ అప్పటికే తనతో ప్రేమాయణం సాగిస్తున్న రాజును అడ్డు తొలగించుకోవాలని నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా అనుమానం రాకుండా ఎలా హత్య చేయాలన్న విషయాలను ఆన్లైన్లో వెతికింది. అలా ఒకసారి అతడికి పండ్ల రసంలో నిద్రమాత్రలను కలిపి తాగించింది.
 
కానీ అతడికి ఏమీ కాలేదు. దాంతో ఇక లాభం లేదనుకుని 2022 అక్టోబరు 14న రాజుని తన ఇంటికి పిలిచింది. అతడికి ఆయుర్వేదిక మెడిసిన్ అంటూ అందులో గడ్డి మందు కలిపి ఇచ్చింది. అది చేదుగా వుండటంతో రాజు ప్రశ్నించాడు. ఐతే అది ఆయుర్వేద మందు కనుక అలాగే వుంటుందనీ, తమ కుటుంబ సభ్యులందరమూ ఆరోగ్యం కోసం దాన్ని తాగుతామంటూ నమ్మించింది. దీనితో అతడు ఆ రసాన్ని మొత్తం తాగేసాడు. ఆ తర్వాత అతడికి వాంతులు అయ్యాయి.
 
వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా అవయవాలన్నీ పాడైపోయి అక్టోబరు 25న మృతి చెందాడు. తనకు వాంతులు అయిన సమయంలో గ్రీష్మ ఇచ్చిన డ్రింక్ గురించి రాజు తన మరో మిత్రుడికి చెప్పాడు. దీన్ని ఆధారం చేసుకుని పోలీసులు గ్రీష్మను అరెస్ట్ చేసారు. విచారణలో ఆమె దోషిగా తేలింది. తనకు కాబోయే భర్తకు తన బోయ్ ఫ్రెండ్... తమ ఏకాంతంగా వున్నప్పటి ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తేడేమోనన్న భయంతో అతడిపై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు గ్రీష్మ అంగీకరించింది. 2022 నుంచి ఈ కేసును విచారించిన కోర్టు చివరికి శుక్రవారం నాడు గ్రీష్మకు శిక్షను ఖరారు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments