Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

వరుణ్
మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (15:04 IST)
విజయవాడ నగరంలో దారుణ ఘటన ఒకటి జరిగింది. ఒక కుటుంబానికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు మృతదేహాలుగా కనిపించారు. ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు ఉండగా, ఇంటి బయట మరో వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. ఉరేసుకున్న వ్యక్తి డాక్టర్ కావడం గమనార్హం. కుటుంబ సభ్యులను హత్య చేసి.. ఆపై తాను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 
 
విజయవాడ పట్టణంలో ఆర్థోపెడిక్ నిపుణుడైన డాక్టర్ శ్రీనివాస్ విజయవాడలోని శ్రీజ అనే ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. ఆయన తన కుటుంబంతో కిసి గురునానక్ కాలనీలో ఉంటున్నారు. ఈయనకు భార్య ఉష (38), తల్లి రవణమ్మ (65), ఇద్దరు పిల్లలు శైలజ (9), శ్రీహాన్ (8)లు ఉన్నారు. వీరిలో రవణమ్మ, ఉష, శైలజ, శ్రీహాన్‌లు ఇంటిలో రక్తపుమడుగులో విగతజీవుల్లో కనిపించారు. 
 
శ్రీనివాస్ మాత్రం ఇంటి ఆవరణలోని చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం వల్లే ఆయన తన ఆస్పత్రిని లీజుకిచ్చారు. కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు... కేసు నమోదు చేసి ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments