ప్రియురాలితో రాత్రంతా గడిపి హత్య చేసి ఇంట్లోనే సమాధి చేసిన కర్కోటకుడు

ఐవీఆర్
మంగళవారం, 7 అక్టోబరు 2025 (20:46 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరం పరిధిలోని నివారి జిల్లా రాజపురా గ్రామంలో దారుణం చోటుచేసుకున్నది. తన ప్రియురాలిని ఇంటికి పిలిచి ఆమెతో రాత్రంతా గడిపి, ఆమె తనను పెళ్లాడమంటూ ఒత్తిడి చేయడంతో హత్య చేసి ఆమెను తన ఇంట్లోనే సమాధి చేసాడు. ఆ సమాధి పైన ఆవు పేడతో అలికి దానిపైన మంచం వేసుకుని హాయిగా నిద్రపోయాడు. ఐతే సదరు మహిళ కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దాంతో విషయం వెలుగులోకి వచ్చింది.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామంలో నివాసం వుంటున్న రతిరామ్ అనే వ్యక్తికి హత్యగావింపడిన మహిళతో కొన్ని నెలలుగా వివాహేతర సంబంధం సాగుతోంది. ఈ క్రమంలో అక్టోబరు 2న తన ఇంట్లో ఎవరూ లేరనీ, ఏకాంతంగా గడిపేందుకు రావాలంటూ మహిళకు ఫోన్ చేసాడు. ఆరోజు రాత్రి ఇద్దరూ గడిపారు. అనంతరం సదరు మహిళ రతిరాంతో తనను పెళ్లాడాలంటూ ఒత్తిడి చేసింది.
 
ఐతే అందుకు ఎంతమాత్రం అంగీకరించిన రతిరాం, ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీనితో ఆమెను హత్య చేసి తన ఇంట్లోనే గొయ్యి తవ్వి ఆమెను పాతేసాడు. ఆ తర్వాత ఆవు పేడ, మట్టి కలిపి సమాధి పైన అలికాడు. దానిపైన మంచం వేసుకుని గత 3 రోజులుగా నిద్రపోయాడు. ఐతే మహిళ కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసారు. తమదైన శైలిలో విచారణ జరపడంతో విషయాన్నంతా చెప్పేసాడు. ట్విస్ట్ ఏమిటంటే... వాస్తవం అంతా చెప్పిన నిందితుడు వాష్ రూంకి వెళ్లొస్తానని చెప్పి పోలీసుల కన్నుగప్పి పరారయ్యాడు. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments