Webdunia - Bharat's app for daily news and videos

Install App

యజమాని భార్యతో వివాహేతర సంబంధం: ప్రియురాలితో పిలిపించి హత్య చేసి అడవిలో పడేశారు

ఐవీఆర్
శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (12:41 IST)
తన మాజీ యజమానితో డబ్బు వివాదం, అతని భార్యతో వివాహేతర సంబంధం కలిగిన 22 ఏళ్ల రెస్టారెంట్ ఉద్యోగి హత్యకు గురయ్యాడు. ఈ దారుణం ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లోని ప్రముఖ హోటల్లో సచిన్ కుమార్ అనే 22 ఏళ్ల వ్యక్తి వెయిటర్‌గా పనిచేసేవాడు.
 
ఇతడు తన యజమాని అయిన హషీబ్ ఖాన్ నుంచి రూ. 2 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. యజమాని భార్య అయిన షబీనా బేగంతో వివాహేతర సంబంధం కూడా పెట్టుకున్నాడు. తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వాలని యజమాని ఎంతగా అడిగినా అతడు ఇవ్వకుండా ముఖం చాటేస్తూ వచ్చాడు. దీనితో హషీబ్ ఖాన్ తన భార్య ద్వారా సచిన్ ను ఇంటికి పిలిపించాడు. ఆ తర్వాత అతడిపై కత్తి దాడి చేసి హత్య చేసాడు.
 
కుమార్ గత ఆదివారం కన్నాట్ ప్లేస్ నుండి అదృశ్యమవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కాల్ డేటాను పరిశీలించారు. అతని కాల్ వివరాలు సంగమ్ విహార్‌లోని అతని చివరి ప్రదేశాన్ని వెల్లడించాయి. దాంతో పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా సచిన్‌ ఇంతకుముందు ఉద్యోగంలో చేర్చుకున్న హషీబ్ ఖాన్‌ వుండే ప్రదేశంగా కనుగొన్నారు. దీనితో తమదైన శైలిలో పోలీసులు విచారణ చేయగా అసలు నిజం బయటపడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments