'నేను పరమశివుడిని... నిన్ను చంపి మళ్లీ బతికిస్తా'నంటూ 70 యేళ్ళ వృద్ధుడి ఘాతుకం

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2023 (09:20 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌ జిల్లాలో దారుణం జరిగింది. తాగిన మైకంలో 70 యేళ్ల వృద్ధుడు కిరాతకంగా ప్రవర్తించాడు. నేను పరమశివుడిని .. నిన్ను చంపి మళ్లీ బతికిస్తానంటూ ఓ వృద్ధురాలిని హత్య చేశాడు. ఈ ఘటనను ఇద్దరు మైనర్లు, మరో వ్యక్తి ప్రత్యక్షంగా చూశారు. పైగా, ఈ దారుణ దృశ్యాలను తమ మొబైల్ ఫోనులో చిత్రీకరించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో కేసు నమోదు చేసి, కిరాతక చర్యకు పాల్పడిన వృద్ధుడిని అరెస్టు చేశారు. 
 
ఈ జిల్లాకు చెందిన ప్రతాప్ సింగ్ (70) అనే వృద్ధుడు పూటుగా మద్యం సేవించాడు. దీంతో కైపు తలకు బాగా ఎక్కింది. సరిగ్గా ఆ సమయంలో అటుగా వెళుతున్న ఓ వృద్ధురాలు కల్కిబాయ్ గమేతి (85)పై తన ప్రతాపం చూపించాడు. తాను పరమ శివుడిని అంటూ ఊగిపోతూ మహిళ ఛాతిపై పిడిగుద్దులు కురిపించాడు. ఈ దెబ్బలకు తాళలేక ఆ వృద్ధురాలు కిందపడిపోయింది. 
 
అయినప్పటికీ వదిలిపెట్టిన ప్రతాప్ సింగ్.. తన చేతిలో ఉన్న గొడుగుతో ఆమెను చావబాదాడు. దీంతో ఆమె మృతి చెందింది. ఈ ఘటన సమయంలో అక్కడ ప్రతాప్ సింగ్‌తో పాటు ఇద్దరు మైనర్లు, నాథూసింగ్ అనే మరో వ్యక్తి ఉన్నారు. వారిలో ఒకరు ఈ దారుణ దృశ్యాలను ఫోనులో చిత్రీకరించారు. కాగా, వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఉదయ్‌పూర్ ఎస్పీ భువన్ భూషణ్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments