Webdunia - Bharat's app for daily news and videos

Install App

సహజీవన భాగస్వామిని.. ఆమె ప్రియుడిని చంపేసిన హత్య.. కాకినాడలో జంట హత్యల కలకలం...

ఠాగూర్
బుధవారం, 20 మార్చి 2024 (12:44 IST)
wకాకినాడలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. సహజీవన భాగస్వామితో పాటు.. ఆమె ప్రియుడిని ఓ వ్యక్తి చంపేశాడు. ఈ అక్రమ సంబంధాన్ని ప్రోత్సహించిందన్న కోపంతో వృద్దురాలైన మహిళ తల్లిపై కూడా దాడిశారు. ఈ దారుణ ఘటన కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చోబ్రోలు శివారులోజరిగింది. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 
 
చేబ్రోలు గ్రామానికి చెందిన పోసిన శ్రీను(45), పెండ్యాల లోవమ్మ(35)ను అదే గ్రామానికి చెందిన లోక నాగబాబు కత్తితో నరికి విచక్షణారహితంగా హత్య చేశాడు. అనంతరం లోవమ్మ తల్లి రామలక్ష్మిపై కత్తితో దాడి చేశాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లోవమ్మ, లోక నాగబాబు కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారని తెలిపారు. అయితే, ఇటీవల పోసిన శ్రీనుతో లోవమ్మ అక్రమ సంబంధం పెట్టుకుంది.
 
ఈ విషయం తెలియడంతో నాగబాబు కోపంతో ఊగిపోయాడు. వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని శ్రీను, లోవమ్మలపై కత్తితో పొడిచి చంపేశాడు. అక్రమ సంబంధానికి సహకరించిందనే ఉద్దేశంతో లోవమ్మ తల్లి రామలక్ష్మిపైనా నాగబాబు దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ రామలక్ష్మిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. కాగా, విభేదాల కారణంగా భర్తకు దూరంగా ఉంటున్న లోవమ్మకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పోసిన శ్రీనుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments