Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాపురానికి ఇంటికి రమ్మని పిలవడానికి వెళ్లిన భర్తపై పెట్రోల్ పోసిన నిప్పంటించిన భార్య...

Webdunia
ఆదివారం, 23 జులై 2023 (13:58 IST)
కాపురానికి ఇంటికి రావాలంటూ పిలిచేందుకు వెళ్లిన భర్తపై కట్టుకున్న భార్య తన తల్లిదండ్రులతో కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీలోని ట్రాన్స్ యమున కాలనీలోని తేవారి భాగియా ప్రాంతానికి చెందిన ప్రీతి, ధర్మేంద్ర అనే వారికి గత 2019 నవంబరు 8వ తేదీన వివాహం జరిగింది. ఈ పెళ్లి జరిగినప్పటి నుంచి ప్రీతి పుట్టింటిలోనే ఉంటూ వచ్చింది. పైగా, ప్రీతితో పాటు ఆమె కుటుంబ సభ్యుల ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని బాధితుడి సోదరుడు లోకేశ్ అంటున్నారు. 
 
ఈ క్రమంలో తన భార్యను కాపురానికి ఇంటికి తీసుకొచ్చేందుకు అత్తారింటికి వెళ్లిన ధర్మేంద్రపై భార్య ప్రీతి తన తల్లిదండ్రులతో కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో ధర్మేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆయన్ను ఇరుగుపొరుగువారు ఆస్పత్రికి తరలించగా, ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై బాధితుడి సోదరుడు లోకేశ్ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ప్రీతితో ఆమె కుటుంబ సభ్యులను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments