Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్కెస్ట్రా ట్రూప్‌లోని ఓ యువతిపై సామూహిక అత్యాచారం...

ఠాగూర్
మంగళవారం, 5 మార్చి 2024 (15:21 IST)
జార్కండ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఇటీవల స్పానిష్ మహిళపై ఏడుగురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఇంకా మరిచిపోకముందే.. తాజాగా మరో దారుణం జరిగింది. ఆర్కెస్ట్రా బృందంలో పాటలు పాడే యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. శీతలపానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చి తనపై ముగ్గురు యువకులు అత్యాచారం చేశారని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి వేడుకలో ప్రదర్శన ఇవ్వాలంటూ పాలాము జిల్లాకు పిలిచి ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపించింది.
 
దీనిపై పోలీసులు స్పందిస్తూ, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన యువతి ఆర్కెస్ట్రా బృందంలో పాటలు పాడుతుంది. ట్రూప్‌తో కలిసి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా వెళుతుంది. ఈ క్రమంలోనే ఝార్ఖండ్‌కు చెందిన ఆర్కెస్ట్రా బృందం నిర్వాహకుడు గోలు అనే వ్యక్తి ఓ కార్యక్రమం కోసం బాధితురాలిని పిలిచాడు. పెళ్లిలో ప్రోగ్రాం ఉందని, తన ట్రూప్‌కు ఓ లేడీ సింగర్ కావాలని కోరడంతో బాధితురాలు తన సోదరితో కలిసి పాలాము జిల్లాకు వెళ్లింది. తీరా అక్కడికి వెళ్లాక ప్రోగ్రాం రద్దు కావడంతో బాధితురాలితో పాటు ఆమె సోదరికి గోలు తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు.
 
చెరో గదిలో వసతి ఏర్పాటు చేసి కూల్ డ్రింక్ ఇచ్చాడు. ఆ కూల్ డ్రింక్ తాగాక తనను మత్తు ఆవరించిందని, అయితే తను మెలకువలోనే ఉన్నానని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఆపై గోలు‌తో పాటు ముగ్గురు యువకులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, ఆ రోజు రాత్రి పదే పదే రేప్ చేశారని పేర్కొంది. బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం