Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను తన వద్దకు రమ్మన్న భర్త.. కత్తితో పొడిచిన ప్రియుడు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2022 (19:28 IST)
చెన్నైలో ఓ దారుణం జరిగింది. ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యను పెద్ద మనస్సుతో కట్టుకున్న భర్త క్షమించాడు. పైగా, భార్యను తన వద్దకు రావాలని ఫోను చేశాడు. ఈ మాటలు ఆమె ప్రియుడికి ఏమాత్రం రుచించలేదు. ఆమెతో వివాహేతర సంబంధాన్ని వదులుకోరాదని భావించిన ప్రియుడు ఆమె భర్తను హత్య చేశాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 33 యేళ్ళ శంకర్ అనే వ్యక్తి పెయింటింగ్ పనులు చేస్తూ చెన్నైలో ఉంటున్నాడు. ఈయనకు తిరునెల్వేలికి చెందిన ఓ మహిళతో వివాహమైంది. పుట్టింటిలోనే ఉంటున్న ఆ మహిళకు స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలిసింది., ఈ నేపథ్యంలో తాను పని చేసే చెన్నైలోనే కలిసివుందామని, అక్కడకు రావాలని ఆమెను ఫోనులో కోరాడు. 
 
ఈ విషయం తెలిసిన ప్రియుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. తన ప్రియురాలు చెన్నైకు వెళితే అక్రమ సంబంధం తెగిపోతుందని భావించి, శంకర్‌ను కలిసేందుకు చెన్నైకు వచ్చాడు. పెయింటింగ్ పనులు చేసే స్థలానికెళ్లి శంకర్‌తో గొడవపడ్డాడు. ఆ తర్వాత తన వద్ద ఉన్న కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments