Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను తన వద్దకు రమ్మన్న భర్త.. కత్తితో పొడిచిన ప్రియుడు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2022 (19:28 IST)
చెన్నైలో ఓ దారుణం జరిగింది. ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యను పెద్ద మనస్సుతో కట్టుకున్న భర్త క్షమించాడు. పైగా, భార్యను తన వద్దకు రావాలని ఫోను చేశాడు. ఈ మాటలు ఆమె ప్రియుడికి ఏమాత్రం రుచించలేదు. ఆమెతో వివాహేతర సంబంధాన్ని వదులుకోరాదని భావించిన ప్రియుడు ఆమె భర్తను హత్య చేశాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 33 యేళ్ళ శంకర్ అనే వ్యక్తి పెయింటింగ్ పనులు చేస్తూ చెన్నైలో ఉంటున్నాడు. ఈయనకు తిరునెల్వేలికి చెందిన ఓ మహిళతో వివాహమైంది. పుట్టింటిలోనే ఉంటున్న ఆ మహిళకు స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలిసింది., ఈ నేపథ్యంలో తాను పని చేసే చెన్నైలోనే కలిసివుందామని, అక్కడకు రావాలని ఆమెను ఫోనులో కోరాడు. 
 
ఈ విషయం తెలిసిన ప్రియుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. తన ప్రియురాలు చెన్నైకు వెళితే అక్రమ సంబంధం తెగిపోతుందని భావించి, శంకర్‌ను కలిసేందుకు చెన్నైకు వచ్చాడు. పెయింటింగ్ పనులు చేసే స్థలానికెళ్లి శంకర్‌తో గొడవపడ్డాడు. ఆ తర్వాత తన వద్ద ఉన్న కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: ప్రేమికులుగా మనం ఎంతవరకు కరెక్ట్ ? అంటున్న రశ్మిక మందన్న

ARi: అరి చిత్రంలో భగవద్గీత సారాన్ని చెప్పా : దర్శకుడు వి. జయశంకర్

Deepika: దీపికా పదుకొనె, ఆలియా భట్ లు తెలుగు సినిమాల్లో చేయమంటున్నారు..

Nayanthara: నయనతార, సుందర్ సి కాంబినేషన్ లో మహాశక్తి

Balakrishna: బాలకృష్ణ కు అఖండ 2: తాండవం కలిసొత్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

తర్వాతి కథనం
Show comments