Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి .. బిల్లు చెల్లించలేదని మృతదేహం ఇవ్వని ఆస్పత్రి యాజమాన్యం!!

ఠాగూర్
గురువారం, 30 మే 2024 (10:00 IST)
అనారోగ్యం కారణంగా కొన్నాళ్లుగా బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కన్నుమూసింది. అయితే, ఆస్పత్రి బిల్లులు చెల్లించకపోవడంతో మృతదేహాన్ని అప్పగించేందుకు ఆస్పత్రి యాజమాన్యం నిరాకరించింది. ఈ దారుణ ఘటన చెన్నైలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అనంతపురం జిల్లా గుత్తికి చెందిన నగదాని మాధురి (27) ఐటీ ఉద్యోగిని. కొన్నాళ్లుగా అస్వస్థతతో బాధపడుతున్న ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం ఏప్రిల్‌లో చెన్నై తీసుకొచ్చారు. సమీప బంధువు ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నారు. క్షయ ఉన్నట్లు గుర్తించి కొద్దిరోజులు చికిత్స తర్వాత డిశ్చార్జి చేశారు. ఇంటికెళ్లిన ఆమె మే 6న తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పోరూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
 
మూత్రపిండాలు, కాలేయంలో ఇన్ఫెక్షన్‌ తీవ్రంగా ఉందని, క్షయ కూడా బాగా ముదిరిందని వైద్యులు గుర్తించారు. ఐసీయూలో చికిత్స అందించారు. సుమారు రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని ఆస్పత్రి సిబ్బంది వెల్లడించడంతో ఆర్థికసాయం కోసం దాతలను అభ్యర్థించారు. రూ.60వేలు వరకు అందింది. ఆరోగ్య బీమా ద్వారా రూ.5 లక్షలు, బంధుమిత్రుల సాయంతో మరో రూ.6 లక్షలతో పాటు మరికొంత చెల్లించారు. 
 
వైద్యానికి మాధురి ఆరోగ్యం సహకరించని నేపథ్యంలో బుధవారం ఉదయం మృతి చెందింది. సుమారు రూ.7.50 లక్షలు వరకు బిల్లులు చెల్లించాల్సి ఉండటంతో మృతదేహాన్ని అప్పగించలేదని మాధురి తండ్రి నగదాని రాజశేఖర్‌ బోరున విలపిస్తూ తెలిపారు. మృతదేహం తీసుకెళ్లడానికి దాతలు సాయం అందించాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

28°C టెంపరేచర్ జానర్‌లో మూవీ సాగదు: నిర్మాత సాయి అభిషేక్

ప్రియదర్శి, పరపతి పెంచే చిత్రం సారంగ పాణి జాతకం: కృష్ణప్రసాద్

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments