ఐదు లక్షల బంగారం, రెండు లక్షల నగదుతో ప్రియుడి బైక్ పైన వధువు జంప్

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (19:53 IST)
మరికాసేపట్లోనే పెళ్ళి. ఇక మండపంలోకి పెళ్ళి కూతుర్ని తీసుకు రావాల్సిన సమయం. ఆమెను తీసుకురండి అన్నాడు పండితులు. మంత్రాలు చదువుతూ ఉండడం.. పెళ్ళి సందడి నెలకొంటే ఇంతలో గట్టిగా అరుపులు. పెళ్ళి కూతురు గదిలో లేదని...
 
చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లె మండలం బురుజుపల్లెకు చెందిన ఒక యువతికి పెళ్ళి నిశ్చయించారు. ఈ నెల 7వ తేదీన నిశ్చితార్థం కూడా జరిగింది. వరుడు ఉన్న ప్రాంతం అనంతపురం జిల్లా పూలుకుంట మండలం కమ్మలవారి బురుజు. వివాహం కోసం అనంతపురం నుంచి నిన్న వచ్చారు.
 
కట్నం ఇచ్చేందుకు పెళ్ళికూతురు తండ్రి 2 లక్షల రూపాయలు తెచ్చిపెట్టాడు. పెళ్ళి కూతురు ఒంటిపై ఐదు లక్షల రూపాయల విలువ చేసే నగలు కూడా ఉన్నాయి. మరో గంటలో పెళ్ళి అనగా చీర మార్చుకుని రమ్మని పెద్దలు చెప్పారు. అంతే గదిలోకి వెళ్ళిన పెళ్ళి కూతురు కనిపించకుండా పోయింది. నగలు, నగదును తీసుకుని వెళ్ళిపోయినట్లు బంధువుల గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
స్థానికంగా ఉన్న సి.సి. ఫుటేజ్‌లో పరిశీలించగా ఒక యువకుడితో కలిసి ఆమె మోటారు సైకిల్ పైన వెళుతుండగా పోలీసులు గుర్తించారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వరుడు లబోదిబోమంటూ అనంతపురం వెళ్ళిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments