Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికకు మద్యం తాగించి ఇద్దరు యువకుల అత్యాచారం.. ఎక్కడ?

ఠాగూర్
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (10:47 IST)
పల్నాడు జిల్లా నరసరావుపేటలో దారుణం జరిగింది. ఓ బాలికకు మద్యం తాగించిన ఇద్దరు యువకులు ఆమె మత్తులోకి జారుకోగానే అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నరసరావు పేట పట్టణ పరధిలో ఓ బాలిక ఎనిమిదో తరగతి చదువుతుంది. ఈ బాలికతో కోటప్పకొండకు చెందిన 17 యేళ్ళ బాలుడికి సంబంధం ఉంది. ఈ క్రమంలో ఓ డ్యాన్స్ పార్టీలో పని చేసే బాలుడు తాను చెడు వ్యసనాలకు అలవాటు పడటమే కాకుండా, ఆ బాలికకు కూడా అలవాటు చేశాడు. 
 
ఇదిలావుంటే బస్తాల దుకాణంలో పని చేసే తన స్నేహితుడైన మరో యువకుడు (21).. బాలిక స్నేహితురాలైన ఆరో తరగతి చదివే బాలికపై కన్నేశాడు. ఈ క్రమంలో ఇద్దరు బాలికలను బుధవారం రాత్రి కోటప్పకొండ రోడ్డులోని తమ గుడికి పిలిపించుకున్నారు. శీతల పానీయంలో మద్యం కలిపి వారితో తాగించారు. దీంతో వారిద్దరూ బాలికలిద్దరూ మద్యమత్తులోకి జారుకున్నారు. ఆపై ఎనిమిదేళ్ల బాలికపై బాలుడు, యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. 
 
ఆటలాడుకునేందుకు వెళుతున్నామని చెప్పిన కుమార్తెలు రాత్రికి కూడా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఒకటో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అనుమానిత యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాన్ని వెల్లడించారు. అక్కడే ఓ గదిలో వీరు నిర్బంధించిన బాలికలను గుర్తించారు. బాలికలతో పాటు సంబంధిత యువకులను కూడా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాలికలకు కౌన్సెంగ్ ఇచ్చారు. అయితే, ఈ సంఘటనపై తల్లిదండ్రులు ఫిర్యాదు వెనుకాడినట్టు తెలిసింది. వివరణ కోరేందుకు ప్రయత్నించగా పోలీసు అధికారులు స్పందించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments