Webdunia - Bharat's app for daily news and videos

Install App

పజ్జీ గేమ్‌‍లో ఓడిపోయాడని బాలుడు ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 12 జూన్ 2022 (19:05 IST)
ఏపీలోని కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పబ్జీ గేములో ఓడిపోవడాన్ని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో మృతుని కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో జరిగింది. పబ్జీ గేమ్‌లో ఓడిపోయాడంటూ స్నేహితులు హేళన చేయడంతో.. దాన్ని జీర్ణించుకోలేక ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని హౌసింగ్ బోర్డుకు చెందిన ఊటుకూరు ప్రభు అనే 16 సంవత్సరాల బాలుడికి ఫోన్​లో పబ్జీ గేమ్ ఆడుతూ వచ్చాడు. అయితే, ఈ గేమ్​లో ప్రభు ఓడిపోయాడు. దీంతో ఓడిపోయాడని తోటి స్నేహితులు అపహాస్యం చేశారు. స్నేహితుల మాటలతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ బాలుడు తన ఇంట్లోనే ఫ్యాన్​కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఊహించని కుమారుడి చర్యతో ఆ కుటుంబం అంతులేని విషాదంలో మునిగిపోయింది. ఆనందం పంచాల్సిన ఆట.. ఆ కుటుంబంలో విషం చిమ్మడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఏ ఇంటా రావొద్దని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments