Webdunia - Bharat's app for daily news and videos

Install App

పజ్జీ గేమ్‌‍లో ఓడిపోయాడని బాలుడు ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 12 జూన్ 2022 (19:05 IST)
ఏపీలోని కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పబ్జీ గేములో ఓడిపోవడాన్ని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో మృతుని కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో జరిగింది. పబ్జీ గేమ్‌లో ఓడిపోయాడంటూ స్నేహితులు హేళన చేయడంతో.. దాన్ని జీర్ణించుకోలేక ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని హౌసింగ్ బోర్డుకు చెందిన ఊటుకూరు ప్రభు అనే 16 సంవత్సరాల బాలుడికి ఫోన్​లో పబ్జీ గేమ్ ఆడుతూ వచ్చాడు. అయితే, ఈ గేమ్​లో ప్రభు ఓడిపోయాడు. దీంతో ఓడిపోయాడని తోటి స్నేహితులు అపహాస్యం చేశారు. స్నేహితుల మాటలతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ బాలుడు తన ఇంట్లోనే ఫ్యాన్​కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఊహించని కుమారుడి చర్యతో ఆ కుటుంబం అంతులేని విషాదంలో మునిగిపోయింది. ఆనందం పంచాల్సిన ఆట.. ఆ కుటుంబంలో విషం చిమ్మడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఏ ఇంటా రావొద్దని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments