Telangana: భర్తను నరికి చంపేసిన ఇద్దరు భార్యలు.. కారణం ఏంటో తెలుసా?

సెల్వి
మంగళవారం, 8 జులై 2025 (15:24 IST)
తెలంగాణ, జనగాం జిల్లా లింగాల ఘన్‌పూర్ మండలం పిట్టలోని గూడెం గ్రామంలో సోమవారం రాత్రి ఒక వ్యక్తిని అతని ఇద్దరు భార్యలు నరికి చంపేసిన ఘటన కలకలం రేపింది. గతంలో జరిగిన హత్యకు సంబంధించిన వివాదం నేపథ్యంలో ఈ హత్య జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. మృతుడిని కనకయ్యగా గుర్తించారు. మృతుడు గతంలో పిట్టలోని గూడెంకు చెందిన గౌరమ్మ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. తరువాత అతను చుక్కమ్మ అలియాస్ శిరీష అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఇద్దరు భార్యలతో కలిసి ఒకే గ్రామంలో నివసిస్తున్నాడు. 
 
రెండు నెలల క్రితం, నల్గొండ జిల్లాలో శిరీష తల్లిని హత్య చేసినట్లు కనకయ్యపై ఆరోపణలు ఉన్నాయి. అప్పటి నుండి అతను పరారీలో ఉన్నాడు. అతను లేని సమయంలో ఇద్దరు భార్యలు పిట్టలోని గూడెంలోనే ఉన్నారు.
 
సోమవారం రాత్రి, కనకయ్య గ్రామానికి తిరిగి వచ్చాడని, ఆ హత్యపై అతనికి, అతని ఇద్దరు భార్యల మధ్య గొడవలు జరిగాయని.. దీంతో ఆవేశానికి గురైన ఇద్దరు మహిళలు కనకయ్యను బండరాళ్లు, గొడ్డలితో నరికి చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. వారు అతని మృతదేహాన్ని గ్రామం వెలుపల పారవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
 
సమాచారం అందిన వెంటనే పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని గౌరమ్మ, శిరీష ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నాయి. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం పంపారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments