Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమానం.. సహజీవన భాగస్వామిని కుక్కర్‌తో కొట్టి చంపాడు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2023 (13:08 IST)
బెంగుళూరులో అద్దెకు తీసుకున్న ఇంట్లో ప్రెషర్ కుక్కర్‌తో తన లైవ్-ఇన్ భాగస్వామిని కొట్టి చంపినందుకు 29 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన భాగస్వామి తనను మోసం చేసిందనే అనుమానంతో ఇద్దరు గొడవకు దిగారు. శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
 
వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన వైష్ణవ్, దేవా(24)లు బెంగళూరులో రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వారు కళాశాల నుండి ఒకరికొకరికి పరిచయం. ప్రస్తుతం వీరిద్దరూ బెంగళూరులోని కోరమంగళలోని సేల్స్, మార్కెటింగ్ సంస్థలో పనిచేస్తున్నారు. శనివారం జరిగిన గొడవలో వైష్ణవ్.. దేవాను ప్రెషర్ కుక్కర్‌తో కొట్టి హత్య చేశాడు. దేవా సోదరి ఫోన్‌లో రాకపోవడంతో ఇరుగుపొరుగు వారిని సంప్రదించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు.
 
"వైష్ణవ్‌కు తన భాగస్వామిపై కొన్ని సందేహాలు ఉన్నాయి, దానిపై వారు గొడవపడ్డారు. శనివారం ఇది మళ్లీ జరిగింది, అతను మహిళను కుక్కర్‌తో కొట్టాడు" అని దక్షిణ బెంగళూరు సీనియర్ పోలీసు అధికారి సీకే బాబా తెలిపారు. 
 
సంఘటన తర్వాత వైష్ణవ్ పరారీలో వున్నాడు. అయితే పోలీసులు అతనిని ట్రాక్ చేసి అరెస్టు చేశారు. వీరిద్దరూ సహజీవనం చేస్తున్న విషయం వారి తల్లిదండ్రులకు తెలిసిందని పోలీసులు గుర్తించారు. 
 
భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. వైష్ణవ్‌పై హత్య కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నచ్చితే బలగం సినిమాలో ప్రోత్సహించండి. నచ్చకపోతే... : దిల్ రాజు

ఆ దర్శకుడు మా కుటుంబ సభ్యుడిగా మారారు : జూనియర్ ఎన్టీఆర్

మలయాళ విలన్ నటుడు మోహన్ రాజ్ ఇకలేరు...

రజనీకాంత్ 'వేట్టయన్' చిత్రం విడుదలపై స్టే విధించండి : హైకోర్టులో పిటిషన్

హుందాతనాన్ని నిలబెట్టుకోండి.. గౌరవప్రదంగా వ్యవహరించండి : ఎస్ఎస్ రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

తర్వాతి కథనం
Show comments