Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడపలో ఇంటర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, పెట్రోల్ పోసి నిప్పంటించారు

ఐవీఆర్
శనివారం, 19 అక్టోబరు 2024 (18:55 IST)
కడపలోని గోపవరం మండలంలో దారుణ ఘటన జరిగింది. దస్తగిరి కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని వస్తున్న దారిలో మాటు వేసిన ఐదుగురు కామాంధులు కిడ్నాప్ చేసి సమీప అడవిలోకి లాక్కెళ్లారు. ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం నిజం ఎక్కడ బయటపెడుతుందోనని బాధితురాలిపై పెట్రోలు పోసి నిప్పంటించారు.
 
ఆమె కేకలు వేయడంతో సమీపంలోని స్థానికులు వచ్చారు. వారు రావడాన్ని గమనించిన కామాంధులు అక్కడ నుంచి పరారయ్యారు. స్థానికులు విషయాన్ని పోలీసులకు తెలుపడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా వున్నట్లు వైద్యులు తెలిపారు.
 
ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బాధితురాలిని మెరుగైన వైద్యం చేయాలని అధికారులకు సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జై హనుమాన్ కోసం హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి

కుటుంబ సమేతంగా చూడదగ్గ వెబ్ సిరీస్.. ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’

కంగువ కోసం ప్రభాస్ - రజనీకాంత్ ఒక్కటవుతారా? అదే కనుక జరిగితే?

లావణ్య చేతిలో చెప్పుదెబ్బ తిన్నాడు.. ఇప్పుడేమో హర్ష కేసు అరెస్టైన శేఖర్ బాషా

కమిట్మెంట్ ఇస్తే ఓ రేటు.. ఇవ్వకపోతే మరో రెమ్యునరేషనా? ఘాటుగా రిప్లై ఇచ్చిన అనన్య నాగళ్ల (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీరా వాటర్ ఎందుకు తాగాలో తెలుసా?

గుండెలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా చేయాల్సినవి ఏమిటి?

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

తర్వాతి కథనం
Show comments