Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను హత్య చేసి లొంగిపోయేందుకు ఠాణాకు వెళుతూ...

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (14:16 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్‌లో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను హత్య చేసిన ఓ భర్త... చేసిన నేరాన్ని అంగీకరించి లొంగిపోయేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళుతూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. వేగంగా వెళుతూ ఆగివున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలను పరిశీలిస్తే, 
 
ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని బంగారుగూడకు చెందిన అరుణ్‌కు నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన దీపతో నాలుగు నెలల క్రితం వివాహమైంది. అయితే, పెళ్లయిన మొదటి రోజు నుంచి భార్య ప్రవర్తనను అనుమానిస్తూ వచ్చిన అరుణ్... శుక్రవారం తెల్లవారుజామున ఆమెను హత్య చేశాడు. 
 
ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయేందుకు స్టేషన్‌కు బైకుపై బయలుదేరాడు. ఈ క్రమంలో వేగంగా వెళ్తున్న అరుణ్ బైకు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అరుణ్ ప్రమాద స్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments