Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను హత్య చేసి లొంగిపోయేందుకు ఠాణాకు వెళుతూ...

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (14:16 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్‌లో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను హత్య చేసిన ఓ భర్త... చేసిన నేరాన్ని అంగీకరించి లొంగిపోయేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళుతూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. వేగంగా వెళుతూ ఆగివున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలను పరిశీలిస్తే, 
 
ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని బంగారుగూడకు చెందిన అరుణ్‌కు నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన దీపతో నాలుగు నెలల క్రితం వివాహమైంది. అయితే, పెళ్లయిన మొదటి రోజు నుంచి భార్య ప్రవర్తనను అనుమానిస్తూ వచ్చిన అరుణ్... శుక్రవారం తెల్లవారుజామున ఆమెను హత్య చేశాడు. 
 
ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయేందుకు స్టేషన్‌కు బైకుపై బయలుదేరాడు. ఈ క్రమంలో వేగంగా వెళ్తున్న అరుణ్ బైకు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అరుణ్ ప్రమాద స్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిక్కుల్లో టాలీవుడ్ హీరో - మరో హీరోయిన్‌పై ఎఫైర్? పోలీసులకు ఫిర్యాదు (Video)

మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత... వీడియో వైరల్!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వాడుకుని వదిలేశాడు.. రాజ్ తరుణ్‌పై లావణ్య

కాలంతోపాటు రజనీకాంత్, మోహన్ బాబు స్నేహం పరుగెడుతుంది

నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సూర్య మూవీ కంగువ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments